త్వరలో జగన్ కూడా విజయవాడకు జంప్?

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా చాలా మంది మంత్రులు ఇప్పటికే విజయవాడకి తరలివచ్చేసారు. ఇంత వరకు హైదరాబాద్ లో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా త్వరలోనే విజయవాడకి తరలించేందుకు ముమ్ముర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనుక ప్రతిపక్ష నేతలు, పార్టీలు కూడా విజయవాడ బాట పడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విజయవాడ నుండి తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పుడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా విజయవాడ తరలివచ్చేందుకు సిద్దం అవుతున్నారని తాజా సమాచారం. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో తన లోటస్ పాండ్ నివాసంలో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయం నుండే రెండు రాష్ట్రాల వ్యవహారాలు చక్కబెడుతున్నారు. వైకాపా తెలంగాణా విభాగానికి అది చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ ఆంద్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాలు చూసుకొనేందుకు అది చాలా ఇబ్బందికరంగా ఉంది.

ఆంద్రప్రదేశ్ లో శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు నిత్యం ఏదో ఒక జిల్లాలో పర్యటిస్తున్న జగన్, అది పూర్తికాగానే తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. ఈ విధంగా హైదరాబాద్ నుండి రాకపోకలు సాగించవలసి రావడం చాలా ఇబ్బందికరంగా ఉండటంతో జనవరిలోగా జగన్ కూడా విజయవాడ తరలి వచ్చేయాలని భావిస్తున్నారు. అమరావతి తయారయ్యే వరకు విజయవాడలోనే ఆయన నివాసం, పార్టీ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం అవసరమయిన భవనాలను అద్దెకు తీసుకోవాలని జగన్ యోచిస్తున్నట్లు తాజా సమాచారం. ప్రభుత్వ శాఖలు, ఉద్యోగులు, రాజకీయ పార్టీలు అన్నీ క్రమంగా తరలివచ్చేస్తే ఇకపై విజయవాడ నగరం రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వ్యవహారాలన్నిటికీ ప్రధాన కేంద్రంగా మారుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close