భూసేకరణను వ్యతిరేకిస్తున్నాం: వైకాపా

రాజధాని ప్రాంతంలో మిగిలిన 2,200ఎకరాల భూమిని రైతుల నుండి స్వాధీనం చేసుకోవడానికి భూసేకరణ చట్టం క్రింద నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మొదట తుళ్ళూరు, బోరుపాలెం, అనంతవరం, పిచుకలపాలెం మరియు అబ్బురాజు పాలెం గ్రామాలలో11.04 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దానితో రాజధాని ప్రాంతంలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భూములు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్న రైతులు తీవ్రంగా నిరసనలు తెలియజేస్తున్నారు. రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కోవడాన్ని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు.

తమ పార్టీ రైతుల అండగా నిలబడి ప్రభుత్వంతో పోరాడుతుందని తెలిపారు. భూసేకరణకు వ్యతిరేకిస్తూ కృష్ణా, గుంటూరు జిల్లాల బంద్ కి పిలుపునివ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కూడా రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులను కలుస్తానని మెసేజ్ పెట్టారు కనుక, ఆయన కూడా వస్తే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. కానీ భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎంతమాత్రం వెనక్కి తగ్గేది లేదని రాష్ట్ర మంత్రులు మాటల ద్వారా స్పష్టం అవుతోంది. కనుక ఈ ఆఖరి ఘట్టంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటీ ఒకవైపు, రైతులు, ప్రతిపక్షాలు,పవన్ కళ్యాణ్ మరోవైపు నిలిచి యుద్ధం చేయడం అనివార్యంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close