ఈ నెల 26నుండి జగన్ ప్రత్యేక దీక్ష

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజుల క్రితం డిల్లీలో ఒకరోజు దీక్ష చేసారు. ఆ తరువాత రాష్ట్ర బంద్ కూడా నిర్వహించారు. మళ్ళీ ఈనెల 26వ తేదీ నుండి గుంటూరులో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారని వైకాపా ప్రకటించింది. కానీ ఆయన చేస్తున్న ఈ హడావుడిపై ఇంతవరకు కేంద్రం స్పందించనే లేదు. రాష్ట్ర మంత్రులు మాత్రం కొంచెం ఘాటుగానే స్పందించారు. రాజకీయ నాయకులు చేస్తున్న ఈ హడావుడి వలన ప్రత్యేక హోదా వస్తుందో లేదో తెలియదు కానీ వారి హడావుడి పెరిగినప్పుడల్లా భావోద్వేగాలకిలోనయి అనేక మంది ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. గత వారం పదిరోజులుగా రాష్ట్రంలో ప్రత్యేక హోదా హడావుడి లేకపోవడంతో ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడినట్లు వార్తలు వినపడలేదు.

జగన్ ఆమరణ నిరాహార దీక్షకి వైకాపా విస్త్రుతమయిన ప్రచారం, ఏర్పాట్లు చేయడం తధ్యం. అలాగే జగన్ చేయబోయే నిరాహార దీక్షని విజయవంతం చేసేందుకు భారీగా జనసమీకరణ చేస్తుంది. వారి హడావుడి పెరిగితే మళ్ళీ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు మొదలయినా ఆశ్చర్యం లేదు. జగన్ ఆమరణ నిరాహార దీక్షకి కూర్చోబోతున్నట్లు ప్రకటించినప్పటికీ, ఈరోజుల్లో ఆమరణ దీక్షలు ఎన్ని రోజుల్లో ఏవిధంగా ముగుస్తున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ రాజకీయ పార్టీలు ఆడుకొంటున్న ఈ ప్రత్యేక చదరంగంలో సామాన్యులు పావులుగా మారి ఓడిపోతున్నారు. ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలు చేస్తున్న పోరాటాల వలన ఆ పార్టీలు బలోపేతం అవుతుంటే, అమాయకులయిన వ్యక్తులు కొందరు ప్రాణాలు తీసుకొంటున్నారు. అటువంటివి జరుగకుండా నివారించవలసిన రాజకీయ పార్టీలు, వారి మరణాలకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని చెప్పి చేతులు దులుపుకొంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close