జగన్‌కు అచ్చిరాని ఒకే ఒక పదం..” సొంత ఇల్లు”..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇల్లు అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టం.. అభిరుచి ఆయన నిర్మించుకున్న ఇళ్లలోనే కనిపిస్తూంటుంది. మొదటగా.. ఇడుపులపాయ ఎస్టేట్‌లో మంచి ఇల్లు ఉంది. ఆ తర్వాత పులివెందులలో ఇల్లు ఉంది. కడపలో ఇల్లు ఉంది. బెంగళూరు శివార్లలో యలహంకలో ప్యాలెస్ ఉంది. హైదరాబాద్‌ లోటస్ పాండ్, తాడేపల్లిలో మరో ప్యాలెస్ ఉంది. ఇప్పుడు.. వైజాగ్‌లో కూడా.. సముద్ర తీరంలో మరో అందమైన ఇల్లు లాంటి ప్యాలెస్ కోసం ప్రణాళికలు వేసుకోక తప్పడం లేదు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ.. ఇన్ని ఇళ్లు ఎందుకు అనే సందేహం.. చాలా మందికి వస్తుంది. కానీ ఇందులో జగన్ తప్పేం లేదు.. ఆయన ఇష్టపడి ఇళ్లు నిర్మించుకుంటున్నారు కానీ.. అందులో ఉండే అవకాశం మాత్రం రావడం లేదు. దేవుడి స్క్రిప్ట్ అలా ఉంటోంది మరి.

వైఎస్ సీఎం కాక ముందు.. జగన్ కుటుంబానికి.. హైదరాబాద్‌లోని సాగర్ సొసైటీలో ఓ చిన్న ఇల్లు ఉండేది. వైఎస్ సీఎం అవగానే.. పులివెందులలో ఒకటి.. కడపలో మరొ ప్యాలెస్ కట్టారు. అయితే అక్కడ శాశ్వతంగా ఉండే అవకాశం లేదు. వాటిని ఆస్తులుగానే చూసుకోవాలి. జగన్ సీఎం కాగానే.. అక్కడో పర్సనల్ సెక్రటరీని ప్రభుత్వ ఖర్చుతో నియమించారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ బెంగళూరు కేంద్రంగా వ్యాపారాలు చేసేవారు. జగన్ వ్యాపార సంస్థలన్నింటికీ నిధుల వరద పారించిన సండూర్ పవర్ కర్ణాటకలోనే ఉంది. అప్పుడు.. బెంగళూరు శివార్లలోని యలహంకలో ఎన్ని ఎకరాలో తెలియదు కానీ.. చాలా పెద్దదే కట్టారు. ఆ ఇల్లు నేషనల్ హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఆ ఇంట్లో.. ఓ నెల రోజులు కూడా ఉన్నారో లేదో కానీ.. వైఎస్ మరణంతో.. హైదరాబాద్ మారాల్సి వచ్చింది.

ఆ తర్వాత లోటస్‌పాండ్‌ చరిత్ర..సీబీఐ రికార్డులకు ఎక్కింది. వైఎస్ మరణం తర్వాత హైదరాబాద్ కేంద్రంగానే రాజకీయాలు చేయాల్సి ఉంటుందని నిర్ణయించుకుని.. తనకు ఉన్న కొన్ని కార్యకలాపాలు లేని కంపెనీల పేరు మీద లోటస్ పాండ్ ను కొనేసి.. నిర్మించేశారు. లగ్జరీలకే లగ్జరీ అని దాని గురించి ప్రచారం జరిగింది. కానీ.. రాష్ట్ర విభజన తర్వాత ఆయన అందులోనూ గడిపిన రోజులు తక్కువే. పాదయాత్ర పేరుతో.. ఎక్కువ సమయం టెంట్లలోనే గడపాల్సి వచ్చింది. అమరావతి ఇంటిని కూడా.. రెండు ఎకరాల్లో భారీగా నిర్మించుకున్నారు. కానీ అందులోనూ ఉండలేకపోతున్నారు. .. అక్కడకు వచ్చి ఆరేడు నెలలు కాకముందే.. చలో వైజాగ్..! అక్కడైనా ఉంటారో లేదో.. !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సజ్జల రాజీనామా చేస్తే ఏమవుతుంది !?

ఏపీలో సలహాదారులకు కూడా కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సలహాదారు రాజకీయ వ్యవహారాలు మాట్లాడేందుకు వీలు లేదు. అయినా సజ్జల...

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close