మోదీ భేటీకి జగన్ డుమ్మా !

ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి సీఎం జగన్ డుమ్మా కొడుతున్నారు. దానికి కారణం ఆ సమావేశంలో చంద్రబాబు కూడా పాల్గొననుండటమే. జగన్మోహన్ రెడ్డి శనివారం ఢిల్లీ వెళ్తున్నారు. అయితే “అజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ” సమావేశంలో పాల్గొనడం లేదు. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగే ఈ కమిటీ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటున్నారు. కమిటీలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ కూడా పాల్గొనాల్సి ఉంది. పాల్గొంటారని కూడా అనుకున్నారు.

కానీ ఆ సమావేశానికి డుమ్మా కొట్టాలన్న ఉద్దేశంతో ఆలస్యంగా ఢిల్లీ వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. సాయంత్రం 4:30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నేతృత్వంలో జరిగే.. ఆజాదీకా మహోత్సవ్ కమిటీ భేటీ జరుగుతుంది. కానీ జగన్ రాత్రి 7:30 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ నిర్వహించే.. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో జగన్ పాల్గొనంటారు. చంద్రబాబు ఉన్న సమావేశంలో జగన్ పాల్గొనడం అసాధ్యమన్న వాదన కొద్ది రోజులుగా వినిపిస్తోంది.

ఆయనను ఫేస్ చేయలేరని టీడీపీ నేతలు చెబుతూ ఉంటారు. ఇప్పుడు అదే నిజమన్నట్లుగా మోదీ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికీ గైర్హాజర్ అవుతున్నారు. ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేని విధంగా సీఎం జగన్ కూడా ప్రధాని మోదీపై పరోక్షంగా విమర్శలు చేస్తూండటం.. విజయసాయిరెడ్డి పార్లమెంట్‌లో బయట కూడా కేంద్రం తీరును ప్రశ్నిస్తూండటంతో బీజేపీతో వైఎస్ఆర్‌సీపీ దూరం జరిగే ప్రయత్నం చేస్తోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే బీజేపీతో గొడవ పెట్టుకునేంత సీన్ వైసీపీకి లేదంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close