మళ్లీ అధికారం రావాలని కలలు కంటోంది జగన్ అండ్ బ్యాచ్. అధికారంలోకి వస్తే ఎం చేయాలో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు. గతంలో చేయలేదు…సెకండ్ టైం పవర్ లోకి వస్తే పార్టీ కేడర్ కు తప్పకుండా న్యాయం చేస్తానని ప్రకటించేశారు. ఇక్కడికి వరకు బాగానే ఉంది. కానీ, సత్తెనపల్లి పర్యటన ద్వారా ఆ పార్టీ రాజకీయ సమాధికి పునాది వేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఏ పార్టీ అయినా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఎక్కడ పొరపాట్లు చేశాం అనేది కొంతవరకు గ్రహించి ముందుకు వెళ్తోంది. కానీ, ఏపీలో వైసీపీ మాత్రం డిఫరెంట్. ఫ్యాక్షన్ పాలిటిక్స్ చేస్తామని ఓపెన్ గానే వార్నింగ్ ఇచ్చేస్తోంది. జగన్ సత్తెనపల్లి పర్యటనలో వెలుగుచూసిన ప్లకార్డు టీవీలో చూసి అందరూ అవాక్కయ్యారు.
గంగమ్మ తలలు జాతరలో వేట తలలు నరికినట్టు.. రప్పా, రప్పా నరకుతాం అంటూ పుష్ప డైలాగ్ ఫ్లెక్సీలో వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించారు. అందులో జగన్ ఫోటోను యాడ్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీ నేతలు ఎవరి తలలు నరుకుతారు? అయినా అధికారంలోకి రావాలనుకునేది తలలు నరికేందుకా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
రెడ్ బుక్ పేరుతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారని వైసీపీ నేతలు ఇప్పటికే ఏడుస్తున్నారు. రెడ్ బుక్ కు ధీటుగా ప్రజలను తమ వైపు ఎలా తిప్పుకోవాలనే దానిపై ఫోకస్ పెట్టాల్సిన వైసీపీ.. జనాలను భయపెట్టేలా బెదిరిస్తోంది. అయినా పవార్ లేకపోయినా బరితెగించి వెంటాడుతాం.. నరుకుతాం..అని చెప్పేస్తుంటే ప్రజలు అమాయకులా..ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచేస్తారు. ఈ విషయం వైసీపీకి ఇంకెప్పుడు అర్థం అవుతుందో !