మళ్ళీ జోస్యం చెప్పిన జగన్: సీఎం కాకుండా ఎవరూ ఆపలేరని సవాల్

హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కుమ్మక్కై తనమీద కేసులు పెట్టారని, ఆ కేసులకు భయపడనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి భూ సేకరణ చేస్తున్న తీరుకు నిరసనగా జగన్ ఇవాళ విజయవాడలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నాడు అధికారంలో ఉన్న సోనియాగాంధీ తనపై అక్రమ కేసులు పెట్టినా భయపడలేదని, పోరాడానని, ప్రస్తుత ప్రభుత్వానికి ఎందుకు భయపడతానని అన్నారు. దేవుడున్నాడని తాను భావించానని చెప్పారు. కానీ ఓటుకు నోటు కేసులో భయంతో చంద్రబాబునాయుడుమాత్రం ప్రధాని మోడి వద్ద రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ఆరోపించారు. బీజేపీ మెడలు వంచేలా హోదాకోసం చంద్రబాబు పోరాడాలని, లేదంటే చంద్రబాబు మెడలు తాము వంచుతామని అన్నారు. చంద్రబాబు పాలన అంతా మోసం…మోసం…మోసం అనే మూడు మాటలమీద నడుస్తోందని చెప్పారు. చంద్రబాబు సర్కార్ ఎంతోకాలం నిలవదని చెప్పారు. ఈ సర్కార్ రెండేళ్ళు ఉంటుందో, మూడేళ్ళు ఉంటుందో తాను చెప్పలేనని, కానీ బంగాళాఖాతంలో కలిసిపోవటంమాత్రం ఖాయమని అన్నారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. దేవుడు రాత రాసి ఉంటే తాను ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ అడ్డుకోలేరని జగన్ చెప్పారు.

జగన్ ఇలా రాతలు, జ్యోతిష్కాల గురించి చెప్పటం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి. చంద్రబాబు ప్రభుత్వం పడిపోతుందని, ఈయన ముఖ్యమంత్రి అవుతారని ఎవరో జ్యోతిష్కులు చెప్పారట. అప్పటినుంచీ ఇదీ వరస.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close