తెలంగాణకు బందరు పోర్టా..? మళ్లీ రచ్చ..!?

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గెలిస్తే..మచిలీపట్నం పోర్టును తెలంగాణకు ఇచ్చేస్తారని ఎన్నికల సమయంలో… జరిగిన ప్రచారం.. ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వస్తోంది. మచిలీపట్నం పోర్టును తెలంగాణకు ఇవ్వడానికి తెర వెనుక ప్రయత్నాలు చివరి దశకు వచ్చాయని… టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఇద్దరూ వేర్వేరుగా ట్వీట్లు చేసి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. వైసీపీ ప్రభుత్వం బందరు పోర్టును తెలంగాణకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని… చంద్రబాబు ఆరోపించారు. జూన్ 28న ఆర్టీ-62 నెంబర్‌తో రహస్య జీవోగా జారీ చేసి.. రెండు రోజుల్లో ‘జారీ చేయబడలేదు’ అని మార్చారని చంద్రబాబు తన ట్వీట్‌లో గుర్తు చేశారు. తెలంగాణకు బందరు పోర్టు ఇస్తున్నారా అని అసెంబ్లీలో ప్రశ్నిస్తే.. అలాంటిదేమీ లేదని బుకాయించారన్నారు. కానీ పోర్టును తెలంగాణకు అప్పగించేందుకు తెరవెనుక ప్రయత్నాలు చివరి దశకు వచ్చాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సీమాంధ్రకు పోర్టులు ప్రకృతి ఇచ్చిన వరమని …ఇలాంటి పోర్టులపై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీ లేదని చంద్రబాబు మండిపడ్డారు. మీ స్నేహాలకు, సొంత లాలూచీలకు..రాష్ట్ర ఆస్తులను ధారాదత్తం చేస్తామంటే సహించబోమని హెచ్చరించారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా.. ఇదే తరహా ఆరోపణలతో ట్వీట్లు చేశారు. ఇవాళ బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తామంటున్నారు …రేపు పాలన కూడా చేతకావడం లేదని కేసీఆర్‌కు అప్పగిస్తారా? అని ప్రశ్నించారు. ఇలాంటి అసమర్ధులు ఒక్క చాన్స్‌ అంటూ ఎందుకు అడిగారని ప్రశ్నించారు. ప్రజల భవిష్యత్‌ను పక్క రాష్ట్రాలకు తాకట్టుపెట్టడానికా అని మండిపడ్డారు. మచిలీపట్నం తెలంగాణకు అప్పగించడానికి గతంలో ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చ జరిగిందన్న ప్రచారం గతంలోనే జరిగింది.

అప్పుడు.. పోర్టులపై ఓ రహస్య జీవోను విడుదల చేసి క్యాన్సిల్ చేయడంతో.. అనుమానాలు పెరిగాయి. ఇప్పుడు…కొన్ని మీడియాల్లో… బందరు తెలంగాణకు అప్పగించడం.. ఏపీకి ఎంతో లాభమని… కథనాలు వస్తూండటంతో… త్వరలోనే… దీనిపై నిర్ణయం తీసుకుంటారని రాజకీయవర్గాలతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చ ప్రారంభమైంది. దీనికి సంబంధించి స్పష్టమైన సమాచారం రావడంతోనే.. చంద్రబాబు, లోకేష్ విమర్శలు చేస్తున్నారని.. టీడీపీ వర్గాలంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close