ప్రజల కామన్‌సెన్స్‌కు పరీక్ష పెడుతున్న జగన్ !

వివేకా హత్య కేసు దగ్గర నుంచి తన పరిపాలనా ఘనతల వరకూ … ప్రతీ అంశంలోనూ సీఎం జగన్ చెబుతున్న విషయాలు.. చెప్పుకున్నంటున్న అంశాలు.. క్రెడిట్ తీసుకుంటున్న వ్యవహారాలు చూస్తే.. ఐదేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపై కనీస అవగాహన ఉన్న వారు కూడా.. నేను విన్నది నిజమేనా అని ఆశ్చర్యపోక తప్పదేమో ?.

వివేకాను చంపింది, చంపించింది ఎవరో దేవుడికి తెలుసు.. జిల్లా ప్రజలకు తెలుసుంటూ కొత్త నాటకాలు ప్రారంభించారు. మరి సీఎంగా ఉండగా నిందితుల్ని ఎందుకు పట్టుకోలేదు ?. అత్యంత దుర్మార్గంగా వివేకా కుమార్తె మీదే ఎందుకు నిందలు వేస్తున్నారు ?. వాళ్లు న్యాయం కోసం పోరాడితే మళ్లీ రాజకీయం కూడా. సొంత కుటుంబాన్నే ఇలా రోడ్డున ప డేసుకుని రాజకీయం చేసుకుంటున్న జగన్… పాలన విషయంలోనూ ఆయన చెప్పే మాటలు వింటే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అయిపోతుంది.

మూడు రాజధానులు ఏర్పాటు చేశాను.. 17 మెడికల్ కాలేజీలు కట్టేశాను.. బోలెడంత అభివృద్ధి చేశారు.. లక్షల కోట్లు ఇచ్చేశాను.. పిల్లలకు ట్యాబులిచ్చాను.. పెద్ద పెద్ద కథలు చెబుతున్నారు. మెడికల్ కాలేజీలు ఎక్కడ కట్టారో.. మూడు రాజధానులు ఎక్కడ ఏర్పాటు చేశారో ఎవరికైనా తెలుసా ?. తాను చెప్పేది నిజమని నమ్మేవాళ్లు ఉంటారన్న ఓ గుడ్డి నమ్మకంతో.. ప్రజల్ని అడ్డగోలుగా మోసం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఎంతగా అంటే తాను చిన్న పిల్లోడినని ఎంతో చేశానని.. కానీ చంద్రబాబు ఎందుకు చేయలేదంటున్నారు. ఆయన చేశానని చెబుతున్నవేమీ జరగలేదు.. అయినా సరే ప్రచారం చేసుకుంటున్నారు.

పక్క పార్టీపై వ్యతిరేకతతోనే.. పక్క నేతలపై వ్యతిరేకతతోనే.. కుల వ్యతిరేకతతోనే.. లేకపోతే మత అభిమనంతోనే తతమను మ్మేవాళ్లు ఉంటారు అన్న ఒకే ఒక్క నమ్మకం.. ప్రజల ఐక్యూకి.. కామన్ సెన్స్ కు జగన్ పరీక్ష పెడుతున్నారు. కళ్ల ముందు కనిపించే వాటిపైనా పచ్చి అబద్దాలు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close