లాలూ, మధుకోడా తర్వాత జగనే..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యాయవాద క్యాంప్ చాలా బిజీగా ఉంది. వచ్చే శుక్రవారం.. కోర్టుకు హాజరవ్వాలా..? అవ్వకపోతే.. కోర్టుకు ఏం చెప్పాలన్నదానిపై.. పాత కేసులు.. ఢిల్లీ స్థాయి న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికిప్పుడు హైకోర్టులో.. పిటిషన్ వేసే ‌అవకాశం లేదు. ఎందుకంటే.. గతంలో పాదయాత్రకు వెళ్తున్న సమయంలో.. జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న పిటిషన్ ను వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌ను సీబీఐ కోర్టుకొట్టి వేసింది. అప్పుడు ఆయన హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు కూడా కొట్టివేసింది. మొన్నటి విచారణలో… దీన్ని గుర్తు చేసిన సీబీఐ కోర్టు.. నేరుగా సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేసుకోవచ్చని సూచించింది.

అయితే ఇప్పటి వరకూ.. సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన కూడా.. జగన్ న్యాయవాదులు చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలన్నదానిపై చర్చలు జరుపుతున్నారు. ఒక వేళ జగన్ కోర్టుకు హాజరయితే.. ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. కోర్టుకు నిందితుడిగా హాజరబోతున్న మూడో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతారు . మొదటి స్థానం ప్రస్తుతం జైల్లో ఉన్న బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ది కాగా.. రెండో స్థానం జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడాది. వాళ్లిద్దరూ.. సీఎంగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడి జైలుకెళ్లారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క సీఎం కూడా.. జగన్ లాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. చరిత్రలో తొలిసారిగా అవినీతి, ఆరోపణలతో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లలో ఒక ముఖ్యమంత్రి హోదాలో సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సిన పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏర్పడింది. నైతికంగా.. ముఖ్యమంత్రిగా ఉండి కోర్టుకు హాజరు కావడం కరెక్ట్ కాదన్న వాదన ఉంది. ముఖ్యమంత్రి స్థానాన్ని అపవిత్రం చేశారన్న విమర్శలు కూడా వస్తాయి. దాంతో జగన్ .. శుక్రవారం ఏం చేయబోతున్నారన్న చర్చ ప్రారంభమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close