ఈ నెలలోనే అసెంబ్లీ – జగన్ “సంచలన ప్రకటన” ఖాయం !

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెలలోనే నిర్వహించాలని నిర్ణయించింది. సాధారణంగా వర్షా కాల సమావేశాలను సెప్టెంబర్ .. అక్టోబర్‌లో నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఈ సారి మాత్రం ముందే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు పెట్టబోతున్నామని గవర్నర్‌కు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ బిల్లులేమిటన్నదానిపై సమాచారం బయటకు రాలేదు. అయితే ఏపీ ప్రభుత్వానికి కీలక బిల్లు అంటే.. మూడు రాజధానులు మాత్రమే.

అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉంది. ప్రభుత్వం ఇంకా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయలేదు. న్యాయపరంగా ఎలాంటి చాన్స్‌లు లేవని నిర్ధారించుకున్న తర్వాతనే అప్పీలుకు వెళ్లలేదని భావిస్తున్నారు. ఇప్పుడు మూడు రాజధానుల అంశాన్ని మరోసారి ఎలా తెరపైకి తేవాలన్నదానిపై మేథోమథనం జరిపి ఓ మార్గాన్ని కనిపెట్టారని అంటున్నారు. అది చట్ట విరుద్ధమైనా… కోర్టుల్లో మళ్లీ అక్షింతలు పడినా సరే… ఓ బిల్లు పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దానికీ అడ్డంకులు ఎదురవుతాయి కానీ.. అలా అవడం వల్లే ఎక్కువ ప్లస్ ఉంటుందన్న వ్యూహం ఉంది.

వచ్చే ఎన్నికలు… ఓటింగ్ పాలన తీరుపై జరగడం కన్నా… మూడు రాజధానుల అంశంపై జరిగితే మంచిదని ప్రభుత్వం భావిస్తోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో ముందస్తు ఎన్నికల ప్రచారం.. ఆ ఎన్నికలకు ఎజెండాను సెట్ చేయడం అన్నీ వైసీపీ .. ఓ వ్యూహం ప్రకారం చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మామూలుగా అయితే ఇంత అర్జంట్‌గా అసెంబ్లీ సమావేశం పెట్టాల్సిన పని లేదని.. ఖచ్చితంగా ఓ సంచలనం ఉంటుందని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బ్ర‌హ్మానందం…. ఇదే చివ‌రి ఛాన్స్!

బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌత‌మ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏకంగా 20 ఏళ్ల‌య్యింది. 2004లో 'ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు' విడుద‌లైంది. అప్ప‌టి నుంచీ... బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మ‌ధ్య‌లో 'బ‌సంతి' కాస్త...

లోక్ సభ ఎన్నికలు : తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని సీట్లను సాధిస్తుంది..?

లోక్ సభ సీట్లపై ఎవరి లెక్కలు వారివే. 14సీట్లు సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే,తాము డబుల్ డిజిట్ స్థానాలను దక్కిచుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.బీఆర్ఎస్ కూడా...

మళ్లీ డేట్ మార్చుకొన్న విశ్వ‌క్ సినిమా

విశ్వ‌క్‌సేన్ క‌థానాయ‌కుడిగా నటించిన చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి'. ఎప్పుడో రెడీ అయినా, ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. మార్చిలో రావాల్సిన సినిమా ఎల‌క్ష‌న్ల వ‌ల్ల ఆగింది. ఎన్నిక‌లు అయిపోయిన...

విదేశాలకు వెళ్లేందుకు జగన్‌కు పర్మిషన్ ఇవ్వొద్దన్న సీబీఐ

పోలింగ్ ముగియగానే కుటుంబంతో సహా లండన్ వెళ్లిపోవాలనుకున్న జగన్ కు సీబీఐ షాకిచ్చింది. ఆయన మళ్లీ తిరిగి వస్తాడన్న నమ్మకం లేదని నేరుగా చెప్పలేదు కానీ.. అలాంటి అర్థం వచ్చేలా అఫిడవిట్ దాఖలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close