కేసీఆర్ “నియోజకవర్గ మార్పు”తో టీఆర్ఎస్‌కు నష్టమే !

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గత రెండు సార్లు గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సారి ఆయన నియోజకవర్గం మారబోతున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు మీడియాకు లీక్ ఇస్తున్నాయి. కేసీఆర్ కూడా ఈ అంశంపై క్లారిటీగా ఉన్నారని అంటున్నారు. ఆయన రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే.. రెండు సార్లూ గట్టి పోటీ ఇచ్చిన నేత వంటేరు ప్రతాప్ రెడ్డి, ఓ సారి టీడీపీ తరపున.. మరోసారి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. రెండు సార్లూ ఆయన గెలిచేస్తారన్నంతగా పోటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆయన టీఆర్ఎస్‌లో చేరారు.

ఈ సారి కేసీఆర్‌కు బదలుగా టీఆర్ఎస్ తరపున వంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేస్తారని క్లారిటీ వచ్చేసినట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ ఈ మేరకు సంకేతాలు ఇచ్చారంటున్నారు. అందుకే ప్రతాపరెడ్డి ఇటీవలి కాలంలో నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్నారు. అయితే ఈ ప్రచారం నిజమో.. వ్యూహమో కానీ దీని వల్ల టీఆర్ఎస్‌ శ్రేణుల్లో నమ్మకం పడిపోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సీఎం నియోజకవర్గం మారడం అంటే.. ఓటమి భయంతోనే అన్న ప్రచారం జరుగుతుంది. సీఎంకే ఓటమి భయం అంటే… ఇతరుల పరిస్థితి గురించి చెప్పాల్సిన పని లేదు.

అధికార వ్యతిరేకత ఎక్కువగా ఉందని ఇప్పటికే టీఆర్ఎస్ పై ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో .. మరింత కాన్ఫిడెంట్‌గా రాజకీయ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఎక్కడా బేలతనం కనిపించకూడదు. కానీ టీఆర్ఎస్ లో మాత్రం ఆ బేలతనం కనిపిస్తోందన్న అభిప్రాయం.. కేసీఆర్ నియోజవర్గ మార్పు ప్రచారంతో తెలుస్తోందని అంటున్నారు. ఈ విషయలో కేసీఆర్ జాగ్రత్త పడాల్సి ఉందని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే కేసీఆర్ వ్యూహం ఏమిటో అంచనా వేయడం కష్టమని.. అన్నీ అంచనాలు వేసుకునే నిర్ణయాలు తీసుకుంటారని వారు నమ్మకంగా ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close