గురు, శుక్రవారాల్లో జగన్ వరద ప్రాంతాల పర్యటన ?

పూర్తి స్థాయిలో సీట్లు కట్టబెట్టిన రాయలసీమ ప్రజలు వరద కష్టాల్లో అల్లాడుతూంటే సీఎం జగన్ పెళ్లిళ్లలో విందు భోజనాలు తింటున్నారన్న విమర్శలు తీవ్రంగా రావడంతో … క్షేత్ర స్థాయిలో పర్యటన చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. గురు, శుక్రవారాల్లో ఆయన కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉందని అధికార వర్గాలకు సమాచారం అందింది. ప్రతిపక్ష నేతలు ఇప్పటికే వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళ, బుధవారాల్లో ఆయా ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పనున్నారు. ఆయన పర్యటన సజావుగా సాగుతుందా ప్రభుత్వం అడ్డుకుంటుందా అన్నది పర్యటనకు వెళ్లినప్పుడే తెలుస్తుంది.

ఇంత దారుణమైన నష్టం జరిగినందున సీఎం జగన్ పర్యటించకపోతే బాగుండదన్న అభిప్రాయం వైసీపీ నేతల్లోనూ ఉంది. అయితే సీఎం జగన్ ఏరియల్ సర్వే చేయడం తప్ప.. ఎప్పుడూ… ప్రత్యక్షంగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించలేదు. తాను ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తుప్పుడు తీత్లీ తుఫాను వచ్చిన సమయంలో పక్కనే ఉన్నప్పటికీ ఆయన ఆజిల్లా బాధితుల్ని పరామర్శించలేదు. కానీ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ఇచ్చిన పరిహారం కంటే రెట్టింపు ఇస్తానని ప్రకటించారు. అయితే ఆయన అధికారంలోకి వచ్చినా.. ఇంకా నష్టం మదింపు చేస్తూనే ఉన్నారు.. ఇంత వరకూ ఇవ్వలేదు.. అది వేరే విషయం.

అలాగే సీఎం అయిన తర్వాత కూడా విపత్తులొచ్చినప్పుడు ఆయన నేరుగా వెళ్లింది లేదు. కానీ ఈ సారి ఆయన వరద బాధిత ప్రాంతాలకు వెళ్లకపోయినా పెళ్లిళ్లకు వెళ్లి విందు భోజనాలు ఆరగించడం .., ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. గురు, శుక్రవారాల్లో ఆయన వరద బాధిత ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పర్యటించే అవకాశం ఉంది. అయితే విపక్ష పార్టీలు మాత్రం అది కూడా కోర్టును ఎగ్గొట్టడానికి ఓ కారణంగా చెప్పుకుని పర్యటనకు వెళ్తారని … ప్రజలపై దయతో కాదని ఇప్పటికే విమర్శలు ప్రారంభించాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

‘విద్య వాసుల అహం’ రివ్యూ: మ‌ళ్లీ పాత పెళ్లి కథే!

తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' ప్రతి వారం ఎదో ఒక కొత్త సినిమా ఉండేలా ప్లాన్ చేస్తుకుంటుంది. ఈ వారం రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ నటించిన 'విద్య వాసుల అహం' ప్రేక్షకులు...

కడప కోర్టు తీర్పు రాజ్యాంగవిరుద్ధంగా ఉందన్న సుప్రీంకోర్టు

వివేకా హత్యపై మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మండిపడింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని.. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని స్పష్టం...

కౌంటింగ్‌లో సహకరించాలన్నట్లుగా ఈసీని బెదిరిస్తున్న సజ్జల !

అయిందేదో అయిపోయింది.. ఇక తప్పు దిద్దుకో అని ఈసీని హెచ్చరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈసీ ఏం తప్పు చేసిందో.. ఎలా దిద్దుకోవాలనుకుంటున్నారో ఆయన పరోక్షంగానే తన మాటలతో సందేశం పంపారు. అదేమిటంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close