జగన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే అంతా చూసుకుంటూ మాట్లాడాల్సి వస్తోంది. పైగా చెప్పేదాంట్లో కొత్తగా ఏం చెప్పడం లేదు. అంతా పాత విషయాలను అటూ ఇటూ తిరగేసి చెప్తున్నారు. దీని వలన జగన్ ట్రోల్ అవుతున్నారు. ఆయనకు అలాగే స్క్రిప్ట్ రాస్తున్నారా? లేదంటే చెప్పడానికి ఏం లేక పాత విషయాలనే పదేపదే చెప్తున్నారా? అన్నది క్లారిటీ లేదు కానీ, జగన్ స్పీచ్ లో క్యాడర్ కోరుకుంటున్నట్లుగా కొత్తదనం కనిపించడం లేదు.
ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చూసుకుంటూ చదవడం వలన పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని అనుకున్నారో, ఎవరైనా సలహా ఇచ్చారో జగన్ ప్లాన్ మార్చారు. జగన్ ట్విట్టర్ వార్ స్టార్ట్ చేశారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల టెన్త్ ఎగ్జామ్స్ పై తీవ్ర విమర్శలు చేసిన జగన్.. తాజాగా రేషన్ పంపిణీ అంశంపై ట్వీట్ చేశారు. వైసీపీ హయాంలో రేషన్ ను డోర్ డెలివరీ చేశామని, టీడీపీ వచ్చాక దాన్ని రద్దు చేయడం సరైంది కాదన్నారు. ఇంటివద్దకే రేషన్ పద్ధతిని ఆపడం వలన 9,260రేషన్ వాహనాలపై ఆధారపడ్డ వారు ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు.
జగన్ హయాంలో రేషన్ డెలివరీ అని చెప్పారే కానీ, దాన్ని అందుకునేందుకు పేదలు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చేది. వాహనాలు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు. వచ్చినప్పుడు పనులన్నీ మానుకుని రేషన్ బండి వద్దకు పరుగులు పెట్టాల్సి వచ్చేది. రేషన్ దుకాణాలు అయితే ఏ సమయంలో అనుకూలంగా ఉంటే అప్పుడు వెళ్లి తెచ్చుకునే వారు. మళ్లీ అలాగే కొనసాగిస్తే బాగుండేదన్న అభిప్రాయం లబ్దిదారుల్లో వ్యక్తం అయింది.
పేదల అభిప్రాయానికి పెద్దపీట వేస్తూ చంద్రబాబు రేషన్ డోర్ డెలివరీ రద్దు చేసినట్లుగా చెప్పారు. రేషన్ దుకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేయబోతున్నట్లు చెప్పారు. దీనిపై జగన్ రాద్దాంతం చేస్తున్నారు. వాస్తవానికి రేషన్ డోర్ డెలివరీ వలన వైసీపీ నేతాలు భారీగా వెనకేసుకున్నారు.
వాహనాదారులతో కలిసి బియ్యం స్కాం చేశారని.. పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. లబ్దిదారులకు ఎంతోకొంత ఇచ్చేసి.. పంపిణీ చేసినట్లుగా నమోదు చేసుకునేవారు. దాన్ని స్మగ్లింగ్ చేసేవారు. ఇప్పుడు అలాంటివి పప్పులేం ఉడకవనే ఈ రాద్దాంతం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.