సిబిఐ కేసులు ఈడీకి బదిలీ చేయాలని జగన్ ఎందుకు కోరుకొంటున్నారో?

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల తేనె తుట్టె మళ్ళీ కదిలినట్లుంది. హైదరాబాద్ సిబిఐ కోర్టులో అతని కేసులపై విచారణ సాగుతున్న సమయంలోనే, డిల్లీలోని ఎన్ఫోర్స్ మెంటు డిపార్టుమెంటు కోర్టు కూడా ఈ కేసులపై సమాంతరంగా విచారణకు సిద్దం అవడంతో ఈ కేసులలో ఏ-1, ఏ-2 ముద్దాయిలుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసారు.

సీబీఐ కోర్టులో విచారణ జరుగుతుండగా మళ్ళీ సమాంతరంగా ఈడీ కోర్టులో కూడా అదే కేసుల మీద విచారణ జరగడం సహజ న్యాయసూత్రాలకు విరుద్దంగా ఉందని, అది తమ హక్కులను హరించడమే అవుతుందని జగన్ తరపున న్యాయవాది డి.ప్రకాష్ రెడ్డి వాదించారు. కనుక సిబిఐ విచారణ ముగిసే వరకు ఈడి కోర్టు తన విచారణను నిలిపివేయవలసిందిగా ఆదేశించాలని హైకోర్టుని అభ్యర్ధించారు.

దీనికి ఈడి తరపున వాదిస్తున్న న్యాయవాది అభ్యంతరం తెలిపారు. “ఒకే కేసుపై ఒకేసారి రెండు వేర్వేరు న్యాయస్థానాలలో విచారణ జరుగకూడదనే నియమం ఎక్కడా లేదు. ఈవిధంగా రెండు చోట్ల వేర్వేరుగా విచారించవద్దని కోరుకొంటున్నట్లయితే సిబిఐ కేసులనన్నిటినీ కూడా ఈడి కోర్టుకే బదిలీ చేయాలని” ఈడి న్యాయవాది కోరారు. అందుకు జగన్ తరపున న్యాయవాది కూడా అంగీకరించారు.

సిబిఐ కేసులను ఈడి కోర్టుకు బదిలీ చేయాలని ఇరు పక్షాల వాదోప వాదనలు విన్న తరువాత సిబిఐ కోర్టులో ఉన్న కేసులను అన్నిటినీ ఈడి కోర్టుకు బదలాయించడంపై ఈ నెల 29లోగా నిర్ణయం తీసుకొని తమకు తెలియజేయవలసిందిగా సీబీఐ కోర్టుకి ఆదేశాలు జారీ చేసి ఈ కేసు విచారణను ఆరోజుకి వాయిదా వేశారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాజా ఇళంగో.

జగన్ కేసులను ఈడి కూడా సమాంతరంగా విచారించాలనుకొంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి కూడా తన కేసులను ఈడి కోర్టుకి బదిలీ కావాలని ఎందుకు కోరుకొంటున్నారో తెలియదు. ఈ కేసుల నుండి బయటపడేందుకు బహుశః డిల్లీ స్థాయిలో ఏమయినా చక్రం తిప్పుతున్నారా అనే అనుమానించవలసి వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close