అధికారం కోల్పోయినా సరే కానీ… జగన్ టార్గెట్ అదే..!?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం మరో మూడు రోజుల్లో ముగియనుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు ఎప్పటికప్పుడు పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలను మార్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో పవన్ ఓటమి లక్ష్యంగా వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది. అధికారం కోల్పోయిన సరే కానీ, పవన్ ను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వద్దనే తలంపుతో జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం పిఠాపురంలో పరిస్థితి పవన్ కు అనుకూలంగా ఉందని వైసీపీకి నివేదికలు అందటంతో జగన్ ఎన్నికల ప్రచార చివరి రోజు షెడ్యూల్ లో మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది.ఎన్నికల ప్రచార చివరి సభను జగన్ పులివెందులలో నిర్వహిస్తారని వైసీపీ వర్గాలు భావించాయి కానీ, పిఠాపురం సభతో ప్రచారం ముగించాలని పార్టీ నేతలకు ఆదేశాలు అందినట్లుగా సమాచారం. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని నేతలకు జగన్ కబురు పంపినట్లుగా తెలుస్తోంది.

పిఠాపురంలో సినీ ప్రముఖులు మొహరించి పవన్ కు మద్దతుగా ప్రచారం చేస్తుండటంతో జనసేనతో పాటు కూటమిలో కొత్త జోష్ కనిపిస్తోంది. దీంతోపాటు జగన్ ను టార్గెట్ చేసి ప్రచార సభల్లో పవన్ ప్రసంగాలతో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పవన్ పోటీ చేసే నియోజకవర్గంలో చివరి సభను నిర్వహించి పిఠాపురంకు వరాల జల్లు కురిపించి పవన్ గెలుపు అవకాశాలను నీరుగార్చాలని జగన్ టార్గెట్ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.

అయినా…జగన్ రెడ్డి హామీలను పిఠాపురం వాసులు విశ్వసిస్తారా..?అనేది తెలియాల్సి ఉంది. అయితే, పిఠాపురంకు జగన్ హామీలు ఇచ్చినా అదంతా పవన్ పోటీ వల్లేనని ఓటర్లు భావించే అవకాశాలు లేకపోలేదు. ఎలా చూసినా పిఠాపురంలో వైసీపీ ఈసారి నెగ్గడం అసాధ్యం అనే అభిప్రాయాలు మాత్రం ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close