ఉప్పల్ లో మ్యాచ్ కు వాన గండం..?

మరికొద్ది గంటల్లో హోం గ్రౌండ్ ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ మరో కీలక మ్యాచ్ ఆడబోతోంది. లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది. ప్లే ఆఫ్ కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సి ఉండటంతో ఈ మ్యాచ్ ను ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు 11 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ ఆరింట్లో గెలిచి 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. లక్నో కూడా 12 పాయింట్లతో ఉండగా నెట్ రన్ రేట్ కారణంగా వెనకబడింది. దీంతో ఈ మ్యాచ్ లో గెలిచి పైస్థానానికి ఎగబకాలని లక్నో పట్టుదలతో కనిపిస్తోంది. ఉప్పల్ మ్యాచ్ లో ఇరు జట్లలో ఏ జట్టు గెలిచినా నెట్ రన్ రేట్ తో సంబంధం లేకుండా ప్లే ఆఫ్ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది.ఈ మ్యాచ్ లో ఓడితే మాత్రం ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి వస్తుంది.

హైదరాబాద్ లో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో నేటి మ్యాచ్ పై అనుమానాలు నెలకొన్నాయి.ఆకాశం మేఘావృత్తమై కనిపిస్తుండటంతో ఈ మ్యాచ్ కు వరణుడు ఆటంకం కల్గిస్తాడా..? అని క్రికెట్ అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వర్షంతో మ్యాచ్ ఆగిపోతే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ ఇవ్వనున్నారు.

నేడు తెలంగాణలో వర్షం కురిసే ఛాన్స్ లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రమంతటా పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ – లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ కు వరణుడు ఆటంకం కలిగించే అవకాశం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోడ్ ఉండ‌గా ఏపీలో టీచ‌ర్ల బ‌దిలీలు… తెర వెనుక ఉంది ఆయ‌నేనా?

ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉండ‌గా ఎలాంటి నిర్ణ‌యాలు ఉండ‌వు. రూల్స్ ప్ర‌కారం... ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు రోజు వారీ కార్య‌కాలాపాలు మాత్ర‌మే జ‌రుగుతుంటాయి. కొత్త ప్ర‌భుత్వాలు ఏర్పాడ్డాక లేదంటే కోడ్...

రూల్స్ పాటించేవాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్లొద్దు : సజ్జల

సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటింగ్ ఏజెంట్లకు రూల్స్ పాటించవద్దని చెప్పి పంపించారు. శిక్షణా కార్యక్రమం పెట్టి రూల్స్ చెప్పాల్సిన పెద్ద మనిషి రూల్స్ పాటించే వాళ్లు కౌంటింగ్ కు వెళ్లొద్దని రూల్స్ విరుద్ధంగా వైసీపీకే...

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు… పత్తాలేని బీజేపీ..!!

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను కనీవినీ ఎరగని రీతిలో నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది అధికార కాంగ్రెస్. పైకి తెలంగాణ ఖ్యాతిని చాటేందుకు అని చెబుతున్నా కాంగ్రెస్ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చాటడమే ఆ...

టెర్రరిస్టులకు సీఎం రేవంత్ నెంబర్ ఇచ్చిన రాజాసింగ్

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టెర్రరిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి నెంబర్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకున్నారు. ఆయనకు పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఐదారు నెంబర్ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close