తేలిపోయిన ఇన్‌సైడర్ కుట్ర..! ఇక జగన్ ఏం చేస్తారు..!?

అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయవర్గాల్లో సైతం సంచలనం సృష్టిస్తోంది. ఓ వర్గం మీడియా ఈ తీర్పును పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ.. అసలు తీర్పులో ఉన్న అంశాలను చూస్తే.. ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించిందన్న విషయం స్పష్టమవుతోందన్న వ్యక్తమవుతోంది. చాలా సూటిగా.. స్పష్టంగా హైకోర్టు తీర్పులో అనేక సమాధానాలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి పద్దతి ప్రకారం వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఎంత ఫేకో స్పష్టం చేస్తున్నాయంటున్నారు.

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో సీఐడీ దాఖలు చేసిన కేసుల్లో విచారణ జరిపిన హైకోర్టు మొత్తంగా 85 పేజీల తీర్పు ఇచ్చింది. భూములు కొనుగోలు చేయటం.. భారత పౌరుడి రాజ్యాంగ, న్యాయపరమైన హక్కు … అమ్మకం దారులు భూముల్ని ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా అమ్ముకున్నారు.. ఈ అమ్మకాల్లో రిజిస్టర్డ్, సేల్ డీడ్స్ ఉన్నాయి.. ఇలాంటి సందర్భంలో.. ప్రైవేట్ వ్యక్తుల మధ్య లావాదేవీలు క్రిమినల్ నేరాల కిందకు రావు.. వారిని ప్రాసిక్యూట్ చేసే అధికారం ఎవరికీ లేదు అని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఇక ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనేది స్టాక్ మార్కెట్లో సెక్యూరిటీ కొనుగోలు, అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడితే మోపే నేరం, ఇన్‌సైడర్ ట్రేడింగ్ కింద జరిగే నేరాలకు ఐపీసీలోని సెక్షన్లను వర్తింపచేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.

ఐపీసీలోని సెక్షన్ 420తో సహా ఏ సెక్షన్ కింద అయినా ఇన్‌సైడర్ ట్రేడింగ్ కింద నేరంగా పరిగణించలేమని… ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనేది ఐపీసీకి కొత్త పదమని స్పష్టం చేసింది. 420, 406, 409, 120బి సెక్షన్ల కింద కేసులు మోపడం..న్యాయ సమ్మతం కాదు.. అందుకే ఎఫ్ఐఆర్‌ కొట్టివేస్తున్నామని స్పష్టంగా చెప్పింది. రాజధాని ఎక్కడ వస్తుందో ప్రముఖ పత్రికల్లో ముందే వచ్చిందని.. సీఎం తన ప్రమాణ స్వీకారం తర్వాత విజయవాడ, గుంటూరు మధ్య.. రాజధాని వస్తుందని ప్రకటించారని ధర్మాసనం తీర్పులో గుర్తు చేసింది. భూములమ్మేవారికి, కొనుగోలు చేసేవారికి.. రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసని… ప్రపంచంలో అందరికీ తెలిశాక. ఇందులో కుట్ర కోణం ఉందని ఎలా చెబుతామని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసులను అనుమతిస్తే భవిష్యత్‌లో.. భూమి అమ్మిన వారంతా ధర పెరిగిన వెంటనే.. కొనుగోలుదారులపై కేసులు పెడతారని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు … అధికార పార్టీకి కొత్తగా అనేక సమస్యలు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో.. ముందు ముందు జరిగే పరిణామాలు కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. బహుశా.. సీబీఐతో విచారణ జరిపించేందుకు తమ పలుకుబడి అంతా ఉపయోగించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో సజ్జల అదే చెప్పారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ సీబీఐ దగ్గర ఉందన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close