జనంలోకి జనసేనాని ! ఎప్పటి నుంచంటే…?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జిల్లాల పర్యటనలకు షెడ్యూల్ ఖరారు చేసుకునే ప్రణాళికలో ఉన్నారు. జిల్లాల పార్టీల అధ్యక్షులతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. తమ పార్టీ నిర్వహించిన శ్రమదానం కార్యక్రమానికి ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చిందని… ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుగా సమస్యను అందరి దృష్టికీ తీసుకువెళ్లామని పవన్ సంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో సానుకూల స్పందన వచ్చిందన్న పవన్..రాష్ట్ర, జిల్లా, మండలస్థాయిలో ఏ కార్యక్రమం నిర్వహించినా ముందుగా ఆ పరిధిలో దెబ్బతిన్న రోడ్లను శ్రమదానంతో బాగుచేయాలని పార్టీ నేతలకు సూచించారు.

ప్రతి జిల్లాలో పర్యటనకు షెడ్యూల్‌ సిద్ధం చేస్తున్నామని జిల్లాలకు వెళ్లినప్పుడు అక్కడ.. పార్టీ అంశాలపై సమగ్రంగా సమీక్షలు నిర్వహిస్తామని పవన్‌ స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులను జిల్లా అధ్యక్షులు, కార్యవర్గం అనుసంధానం చేసుకొంటూ ముందుకు తీసుకువెళ్లాలని పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ జిల్లా అధ్యక్షులకు సూచించారు. పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణం పూర్తి చేసి వారికి శిక్షణ కూడా ఇవ్వాలని నిర్ణయించారు.

ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతోంది. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన కూడా యాక్టివ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలు జనసేన పార్టీలో ఊపు తీసుకు వచ్చాయి. తర్వాత కార్యక్రమం ఏమిటన్నదానిపై స్పష్టత లేకపోవడంతో మళ్లీ స్తబ్దత ఏర్పడింది. దీంతో జిల్లాల పర్యటనలకు పవన్ కల్యాణ్ సన్నాహాలు చేసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close