“రామ్‌మాధవ్‌”పై అవినీతి ముద్ర కూడా పడింది..!

ఆరెస్సెస్ నుంచి బీజేపీలోకి వచ్చి అక్కడ ఓ రకంగా చాలా ఉన్నతమైన స్థానాన్ని పొంది.. మంచి గౌరవం అందుకున్న రామ్ మాధవ్‌ ఇప్పుడు తిరిగి ఆరెస్సెస్‌కు వెళ్లిపోయారు. మధ్యలో ఏం జరిగిందో తెలియదు. బీజేపీలో అన్ని పదవుల నుంచి ఆయనను తొలగించారు. రాజ్యసభ, కేంద్రమంత్రి అంటూ జరిగిన ప్రచారాన్ని లైట్ తీసుకున్నారు. ఇప్పుడు ఆయనకు ఆరెస్సెస్‌లోనే మళ్లీ ఏదో పదవి ఇచ్చారు. అయితే ఆయనను బయటకు పంపేయడానికి చాలా కారణాలు ఉన్నాయని ఇప్పుడిప్పుడే కొంత సమాచారం బీజేపీ ముఖ్య నేతల నుంచే బయటకు వస్తోంది.

జమ్మూకశ్మీర్‌కు లెఫ్టినెంట్ గవర్నర్‌గా పని చేసిన సత్యపాల్ మాలిక్ ఇటీవల అవినీతి ఆరోపణుల చేశారు. తాను సంతకాలు పెడితే వందల కోట్లు ఇస్తానన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా ఎవరు చెప్పారు అంటే.. అప్పటి బీజేపీ ఇంచార్జ్. జమ్మూకశ్మీర్‌కు అప్పటి బీజేపీ ఇంచార్జ్ రామ్మాధవ్. దీంతో అందరి దృష్టి ఆయనపై పడింది. ఆయన ఎక్కడ కనబడినా మీడియా అడుగుతోంది. అయితే ఆయన మాత్రం తనకేం తెలియదని.. సత్యపాల్ మాలిక్‌నే అడగాలని చెబుతున్నారు. ఓ తడబాటు ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఈనాశ్య రాష్ట్రాల్లో బీజేపీ పతాకం ఎగరడం వెనుక ఆయన పాత్ర ఉంది. ఆయన ఈశాన్య రాష్ట్రాల్లో ఓ స్వచ్చంద సంస్థ పెట్టి .. వాటికి సంబంధించిన వారిని ఆయా రాష్ట్రాల్లో సలహాదారులుగా పెట్టి.. సమాంతర పాలన చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రామ్‌మాధవ్‌ దక్షిణాదిలోనూ రాజకీయాలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయనను పొగుడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయనపై సొంత పార్టీ నేతలే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close