గడ్డి పరకతో విప్లవం..! జనసేన ట్విట్టర్ ఖాతాలన్నీ యాక్టివ్..!

జనసేన పార్టీ, ఆ పార్టీ సానుభూతి పరుల ఖాతాలను… ట్విట్టర్ అనూహ్యంగా బ్లాక్ చేయడంతో.. ఏర్పడిన అలజడి సద్దుమణిగింది. అదిరేది.. బెదిరేది లేదన్న జనసేనాధినేత పోరాటానికి ట్విట్టర్ ఇండియా దిగి వచ్చింది. అకౌంట్లన్నింటినీ రీ స్టోర్ చేసింది. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక హక్కును కాలరాయకుండా.. పునరుద్ధరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే.. అసలు ఖాతాలను ఎందుకు నిలిపివేశారు..? ఎవరి కుట్ర అయినా ఉందా..? అనే విషయాలపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. దేశంలో భావ ప్రకటనా స్వేచ్చ ఉంది. అయితే.. ఇప్పుడు అది ప్రమాదంలో పడిందని.. జనసేన ట్విట్టర్ అకౌంట్ల బ్లాక్ చేయడం ద్వారా.. తేలిందని జనసేన వర్గాలు చెబుతున్నారు. ఆ కోణంలోనే పోరాటం చేశారు. అనుకున్న ఫలితం సాధించారు.

ఇటీవలి కాలంలో.. అధికారంలో ఉన్న వారు.. సోషల్ మీడియాను సైతం నియంత్రించడం.. తాము ఎంత దుష్ప్రచారం అయినా చేయవచ్చు కానీ.. తమ గురించి నిజాలు కూడా చెప్పకూడదన్నట్లుగా పాలకుల వ్యవహారశైలి ఉంది. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు కేసులు పెడుతున్నారు. వారి కార్యకర్తలు సోషల్ మీడియాలో చేసే పోస్టులపై ఫిర్యాదులు చేస్తే మాత్రం కనీసం స్పందించడం లేదు. ఇక్కడే అసలు కుట్ర బయటపడుతోంది. దీనికి తోడు… ప్రభుత్వాల స్థాయిలో ఒత్తిడి తెచ్చి… ప్రత్యర్థి పార్టీల ఖాతాలను బ్లాక్ చేయించే సంస్కృతికి కూడా.. ప్రాణం పోస్తున్నారు. జనసేన వ్యవహారంతో అది తేలిపోయింది.

ట్విట్టర్ ఖాతాలను నిలిపి వేయడంపై.. నేరుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రంగంలోకి దిగిపోరాడారు. దీని కోసం ఆయన రోడ్డెక్కలేదు. ఆన్ లైన్ లోనే పోరాడారు. గడ్డిపరకతో విప్లవం ఎలా ఉంటుందో… చూపిస్తామన్నట్లుగా ఆయన చేసిన పోస్టు వైరల్ గా మారింది. ట్విట్టర్ ఇండియా విశ్వసనీయతపైనే సందేహాలు వెల్లువెత్తడం… యురేనియం ఉద్యమానికి వ్యతిరేకంగా ట్విట్టర్ కూడా వ్యవహరిస్తోందన్న భావన ప్రజల్లో ఏర్పడటంతో… ముందు జాగ్రత్తగా ట్విట్టర్ ఖాతాలను రీస్టోర్ చేసినట్లుగా తెలుస్తోంది. జనసేన ఖాతాల బ్లాక్ వెనుక అసలు కారణం ట్విట్టర్ ఇండియా బయట పెడితేనే.. తెర వెనుక ఏం జరిగిందో తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close