జవహర్ రెడ్డి చక్కబెడుతున్న భూములెన్ని !?

సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం ఏపీలో ఎన్నో సంచలనాలకు కారణం అవుతోంది . కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ లోపు ఆయన వ్యవహారాలు మాత్రం వివాదాస్పదం అవుతున్నాయి. విశాఖలో చాలా వరకూ భూములు బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఉత్తరాంధ్రలో రూ.2 వేల కోట్ల విలువైన అసైన్డ్‌ భూములను కొట్టేశారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు. సీఎస్ అయ్యాకే భూముల మార్పిడి జీవో 596 ఇచ్చారని ఆ జీవో ఆధారంగానే సీఎస్‌ కుమారుడు విశాఖలో 800 ఎకరాలకు పైగా భూములు చేజిక్కించుకున్నారని ఆరోపిస్తున్నారు. ఎస్సీ, బీసీ అసైన్డ్‌ భూములను బినామీల పేరిట సొంతం చేసుకున్నారని అంటున్నారు. ఎకరం రూ.2 కోట్లు పలికే భూములను ఐదారు లక్షలకే జవహర్‌రెడ్డి ముఠా ఒప్పందాలు చేసుకుందని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి నుంచి జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు.

ఈ ఆరోపణలపై జవహర్ రెడ్డి ఉలిక్కి పడ్డారు. బెదిరించేలా రిప్లయ్ ఇచ్చారు. ఆరోపణలు వెనక్కి తీసుకోకపోతే కేసులు పెడతామని హెచ్చరించారు. ఆయన ఉలికిపాటు చూసి.. ఏదో ఉందని రాజకీయవర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి. ఇటీవల సీఎస్ జవహర్ రెడ్డి రెండు సార్లు విశాఖలో పర్యటించారు. జగన్ ప్రమాణస్వీకార ఏర్పాట్ల కోసం అని పుకారు లేపారు. కానీ అసలు విషయం వేరే ఉందని.. ఆయన భూములు చక్క బెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికలు అయిపోయినందున ఈ ఆరోపణల వల్ల రాజకీయ లాభం ఉండదు… అందుకే.. నిజాలేంటో బయటకు రావాల్సి ఉందన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆయనొస్తే.. ఇక బీఆర్ఎస్ ను ఆపే వారే ఉండరు..!

తెలంగాణ గవర్నర్ గా కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారనే ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ ఫ్యూచర్ పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్ గా...

ఘోర రైలు ప్రమాదం… కవచ్ టెక్నాలజీ ఏమైంది..?

దేశంలో ఒక దాని వెనక మరొకటి వరుసగా రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ ఘటన మరవక ముందే మరో ఘటన జరుగుతుండటంతో రైలు ప్రయాణాలు అంటే ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా...

లోక్‌సభ స్పీకర్‌గా టీడీపీ అభ్యర్థి అయితే ఏకగ్రీవం !

లోక్‌సభ స్పీకర్ గా టీడీపీ అభ్యర్థిని నిలబెడితే తాము మద్దతు ఇస్తామని ఇండియా కూటమి ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు ఇప్పటికే ఎన్డీఏపై ఒత్తిడి తెస్తున్నరని తమకు స్పీకర్ పదవి ఇవ్వాలని...

చైతన్య : ఓడిపోయినప్పుడే ఈవీఎంలు గుర్తు రావడం అసలు రోగం !

ఈవీఎంలపై భారత రాజకీయ పార్టీల్లో ఎవరికీ నమ్మకం లేదు. చివరికి బీజేపీ, కాంగ్రెస్ కు కూడా లేదు. కానీ వారి అభిప్రాయాలు ఫలితాలు వచ్చినప్పుడల్లా మారిపోతూండటంతోనే సమస్య వస్తోంది. గెలిచిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close