జీవిత రాజశేఖర్ స్టైలే వేరు..! ఏపీలో వైసీపీ.. తెలంగాణలో బీజేపీ..!

వైసీపీ నుంచి బీజేపీలో చేరారు జీవిత. కరోనా బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురై.. ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రాజశేఖర్ మెడికల్ రెస్ట్‌లో ఉండటంతో… జీవిత ఒక్కరే.. చేరిక కార్యక్రమానికి హాజరయ్యారు. బీజేపీ హైదరాబాద్ కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమంలో ఈ మేరకు… ఆమె పార్టీలో చేరారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో చాలా మంది నేతలను బీజేపీలో చేర్చుకున్నారు. అలా చేరడానికి వచ్చిన వారిలో జీవిత కూడా ఉన్నారు. బండి సంజయ్.. అందరికీ కండువాలు కప్పారు కానీ.. జీవితకు మాత్రం కప్పలేదు. సిగ్గుపడ్డారో.. మర్చిపోయారో కానీ… ఎంత సేపు చూసినా బండి సంజయ్ పార్టీ కండువా కప్పకపోవడంతో చివరికి తనంతట తానుగా కప్పుకున్నారు. ఆ కండువాతోనే వేదికపై కూర్చున్నారు. ఆ సన్నివేశాన్ని చూసిన వాళ్లు పాపం జీవిత అనుకున్నారు.

నిజానికి జీవిత రాజశేఖర్ లు ఏ పార్టీలో ఉంటారో వాళ్లకే క్లారిటీ ఉండదు. గతంలో కూడా బీజేపీలో చేరారు. జీవితకు కిషన్ రెడ్డి.. సెన్సార్ బోర్డు పదవి ఏదో ఇప్పించారు కూడా. అయితే ఆ తర్వాత మళ్లీ వైసీపీలో చేరారు. మొదటగా వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజారాజ్యం టైంలో వారిపై దాడి జరగడంతో.. మీడియాలో రచ్చ చేశారు. దాంతో వైఎస్ వారిని అభినందించి పార్టీలోకి ఆహ్వానించారు. అంబటి రాంబాబుతో గట్టి సంబంధాలున్నాయని చెప్పి.. వారికి అప్పట్లోనే కండువా కప్పేశారు. తర్వాత వైఎస్ చనిపోయిన తర్వాత… వైసీపీలో చేరారు. జగన్ ఏ దీక్షలు చేపట్టినా అక్కడుకు వెళ్లేవారు. అయితే… వైసీపీ నేతలు జీవితను రమ్మన్నారు కానీ.. రాజశేఖర్ రావొద్దని కోరడంతో ఇద్దరూ వైసీపీకి గుడ్ బైచెప్పారు. విమర్శలు కూడా చేశారు. తర్వాత బీజేపీలో చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీతో సన్నిహితంగా ఉన్నట్లుగా కనిపించారు. కానీ.. టీడీపీ వాళ్లు కండువా కప్పేంత ధైర్యం చేయలేదు.

ఈ లోపు ఎన్నికలకు ముందు.. ఓ మిషన్ లాగా.. సినిమా వాళ్లను చేర్చుకునే క్రమంలో.. మళ్లీ జీవిత రాజశేఖర్‌లకు కండువా కప్పారు. వారు కూడా… జగన్ ను గతంలో అన్న మాటలు మర్చిపోయి… పార్టీలో చేరిపోయి..మళ్లీ పొగడ్తలు ప్రారంభించారు. అయితే.. చాలా మందిలాగే… ఆమెకూ… ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదు. ఏ పదవీ ఇవ్వలేదు. దాంతో… ఇప్పుడు జీవిత తెలంగాణ వైపు చూసుకుంటున్నారు. బీజేపీలో చేరిపోయారు. తెలంగాణలో బీజేపీ ఊపు మీద ఉండటం.. కేంద్రంలోనూ అధికారంలో ఉండటంతో.. ఏదో ఓ ప్రాధాన్యత దక్కుతుందని ఆశ పడుతున్నారు. అయితే.. కండువా వేయడానికే మొహమాటపడిన బండి సంజయ్… పదవి వచ్చేలా సహకరిస్తారంటే… కష్టమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే… ఏపీలో జీవిత రాజశేఖర్ పార్టీ వైసీపీ.. తెలంగాణలో బీజేపీ. ఎవరు ప్రాధాన్యం.. పదవి ఇస్తే.. ఆ పార్టీ తరపున మాట్లాడటానికి సిద్ధంగా ఉంటారన్నమాట. రాజకీయాల్లో ఎలా ఉండకూడదో… అనే దానికి సాక్ష్యంగా ఈ సినీ దంపతులు నిలుస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close