జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటు ఇంకా ఎప్పుడో?

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్. వొహ్రా జెండా ఎగురవేసి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆ రాష్ట్రంలో ఇదివరకు అధికారంలో ఉన్న పిడిపి-బీజేపీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఆ రెండు పార్టీల మధ్య కొన్ని అంశాలపై ప్రతిష్టంభన ఏర్పడినందున పిడిపి అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ ఇంతవరకు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఆ కారణంగా రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించడం చేత నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జెండా ఎగురవేసి ఆ కార్యక్రమాలలో పాల్గొనవలసి వచ్చింది. అదేమీ తప్పు కాకపోయినప్పటికీ, రెండు రాజకీయ పార్టీల పంతాల కారణంగా, సుమారు నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నట్లే భావించవచ్చును. ఒకవేళ ఆ రెండు పార్టీలకు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి, ఆసక్తి లేనట్లయితే, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోలాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కూడా రాష్ట్రపతి పాలన విధించి ఉంటే ఇటువంటి విమర్శలకు తావుండేది కాదు.

తన తండ్రి అడుగుజాడలలోనే తాను కూడా నడుస్తానని చెపుతున్న మహబూబా ముఫ్తీ, తమ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉన్న బీజేపీకి అనేక షరతులు విధిస్తోంది. చివరకి పాకిస్తాన్ తో భారత్ ఎటువంటి విధానం అవలంభించాలో కూడా ఆమె నిర్దేశిస్తున్నారు. అలాగే బీజేపీ కూడా అధికారం పంచుకొనే విషయంలో పిడిపికి కొన్ని షరతులు విధిస్తున్నట్లు సమాచారం. పాకిస్తాన్ వంటి దేశానికి ఆనుకొని ఉన్న సరిహద్దు రాష్ట్రమయిన జమ్మూ కాశ్మీర్ లో ఎప్పుడూ కూడా పరిస్థితులు సమస్యాత్మకంగానే ఉంటాయి. అటువంటి చోట బలమయిన ప్రభుత్వం కలిగి ఉండటం అత్యవసరం. కానీ రెండు పార్టీలు తమ రాజకీయ అవసరాలు, ప్రయోజనాలనే చూసుకొంటున్నాయి తప్ప రాష్ట్ర పరిస్థితులను, ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవడం లేదనిపిస్తోంది. రాష్ట్రంలో గవర్నర్ పాలన ఇంకా ఎంత కాలం సాగుతుందో తెలియదు కానీ రాష్ట్రంలో ఏదయినా అవాంచనీయ సంఘటనలు జరిగితే అందుకు ఆ రెండు పార్టీలదే బాధ్యత అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close