న్యూ టాస్క్ : ఒక పూట భోజనం మానేయండి..!

భారతీయ జనతా పార్టీ తమ పార్టీ కార్యకర్తలకు ఓ కొత్త టాస్క్ ఇచ్చింది. పార్టీ కార్యకర్తలందరూ.. ఓ పూట భోజనం మానేయాలని సూచించింది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. ఈ సందర్భంగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. ఈ మేరకు కార్యకర్తలకు కొన్ని సూచనలు చేశారు. కార్యకర్తలందరూ.. ఓ పూట భోజనం మానేయాలన్నది ఆ సూచనల్లో ఒకటి. ఫీడ్ ద నీడ్ అనే కార్యక్రమం ప్రకటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ప్రతి కార్యకర్త .. ఆరుగురు పేదలకు భోజనం పెట్టాలని నిర్దేశించారు. అలాగే పోలింగ్ కేంద్రం స్థాయిలో.. ఓ కార్యకర్త.. ఇద్దరికి మాస్క్‌లు అందించాలని పిలుపునిచ్చారు. అలాగే.. కరోనాపై పోరాడుతున్న వారికి కృతజ్ఞతలు చెప్పాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా… కార్యకర్తలకు ఇదే సందేశం ఇచ్చారు.

పార్టీ వ్యవస్థాప దినోత్సవం సందర్భంగా సందశం ఇచ్చిన నరేంద్రమోడీ.. కోవిడ్ -19 పై పోరాడుతున్న వారికి సంఘిభావంగా ఓ పూట భోజనం మానేయాలన్నారు. పార్టీ చేసిన ఈ సూచనను అందరూ పాటించాలని పిలుపునిచ్చారు. పార్టీ వ్యవస్థాపక కార్యక్రమాల్లో సామాజిక దూరం పాటించాలని సూచించారు. నరేంద్రమోడీ, జేపీ నడ్డా.. ఈ సారి ఒక్క పూట భోజనం మానేసి.. ఆరుగురికి పెట్టాలన్న కాన్సెప్ట్‌ను.. కేవలం భారతీయ జనతా పార్టీకే పరిమితం చేశారు. ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఈ టాస్క్ ఇచ్చారు. కరోనాలాక్ డౌన్ ప్రకటించిన తర్వాత రెండు సార్లు సాధారణ ప్రజలకు టాస్క్ ఇచ్చారు. ఓ సారి చప్పట్లు కొట్టాలని.. మరోసారి దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు.

ప్రజలు విపరీతంగా స్పందించారు. ఇప్పుడు బీజేపీ కార్యకర్తలకు మాత్రమే భోజనం మానేయాలని పిలుపునిచ్చారు కాబట్టి.. వారు మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరిపే అవకాశం ఉంది. అలాగే.. పెద్ద ఎత్తున పేదలకు. బీజేపీ నేతలు, కార్యకర్తలు… భోజనాలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. రోజుకూలీలకు ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో కడుపు నిండా తిండి దొరకని పరిస్థితి ఉంది. మోడీ టాస్క్‌తో కొంత వరకైనా వారికి బీజేపీ కార్యకర్తలు కడుపు నింపే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close