ఏపీలో ఇక జేపీ నడ్డా ఆపరేషన్..!

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేయాలనుకుంటున్న అమిత్ షా.. జేపీ నడ్డాకే.. పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ విషయాన్ని తాను డీల్ చేస్తున్నప్పటికీ.. ఏపీ విషయాన్ని మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాకే అప్పగించారు. ఆయన తరచరూ.. ఏపీ విషయంలపై సమీక్ష చేస్తున్నారు. పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతలను ఢిల్లీ పిలిపించి కండువా కప్పి అభయం ఇచ్చి పంపుతున్నారు. ఇప్పుడు నేరుగా ఏపీలోకి అడుగు పెడుతున్నారు. పదో తేదీన ఆయన విజయవాడలో రోజంతా.. కీలకమైన సమావేశాలు ఏర్పాటు చేశారు. బూత్ కమిటీ సభ్యులు, ముఖ్యనాయకులతో ఆయన సమావేశవుతారు. పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యక్రమాలు… ఇతర బాధ్యతలను నేతలకు అప్పగిస్తారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతాపార్టీని బలమైన పార్టీగా రూపుదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఆ పార్టీ అగ్రనేతలు. రాష్ట్రంలో పార్టీకి బలం లేకున్నా… కేంద్రంలో అధికారంలో ఉండటం.. మోదీ, అమిత్ షా ల రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. మోదీ పిలుపుతో గాందీజీ సంకల్పయాత్రను వివిధ ప్రాంతాలలో బీజేపీ నేతలు నిర్వహించారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలలో ఇంటింటికీ తిరుగుతూ.. కేంద్ర పధకాలను ప్రచారం చేశారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను కూడా వివరించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను బీజేపీకి అనుకూలంగా మార్చుకునేలా పావులు కదుపుతున్నారు.

ఇతర పార్టీల నుంచి వచ్చే అనేక మంది నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా జనాల్లో కూడా బీజేపీపై ఒక నమ్మకం కల్గించాలని అగ్రనేతలు భావిస్తున్నారు. గాంధీ సంకల్పయాత్ర ద్వారా బీజేపీ ప్రజలకు చేరువ అయ్యామని.. భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ జనాదరణ పొందుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా… బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు. ఇటీవల టీడీపీ నుంచి బీజేపీ లో చేరిన నేతలే.. క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close