శెట్టి బలిజల్ని తిట్టి సారి చెప్పిన జూపూడి !

వైసీపీ నేతలకు కులాలతో ఎలా ఆటలాడుకోవాలో బాగా  స్టడీ చేసి గేమ్ ఆడుతున్నట్లుగా ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా కొన్ని కులాలను కించపర్చడం .. ఆ తర్వాత అబ్బే అదేమీ లేదనడం పరిపాటిగా మారింది. అమలాపురంలో వైసీపీ నేతలపై దాడులకు.. శెట్టిబలిజలే కారణం అని..  జూపూడీ ప్రభాకర్ ఆరోపించారు. అంతే కాదు. .. వారిపై దారుణమైన ఆరోపణలు చేశారు. వారు స్పహలో ఉండి చేయలేదని గంజాయి మత్తులో ఉండి అలా ప్రవర్తించారని జూపూడి ప్రభాకర్‌ విమర్శించారు. శెట్టి బలిజలు కోనసీమలో ఎస్సీలతో కలిసి ఉంటారని, ఎన్నికల్లో ఒక్కటవుతారన్నారు.

కోనసీమలోని శెట్టి బలిజల్లో కూడా అంబేడ్కర్‌ పేరును సహించలేనటువంటి ఒక తరం వచ్చిందని, తనకు సమాచారం అందిందన్నారు.  ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. వైసీపీలోని శెట్టి బలిజ నేతలు కూడా మండిపడ్డారు. పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదుచేశారు. దీంతో ఆయన సారీ చెప్పాలని హైకమాండ్ ఆదేశించింది. నిజానికి ఓ కులంపై ఇష్టారీతిన ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి జూపూడి ప్రభాకర్ సిద్ధం కారు.

ఆయనకు వైసీపీ వ్యూహకర్తలు ఏం మాట్లాడాలో చెప్పిన తర్వాతనే మాట్లాడి ఉంటారు. ఓ రకమైన కుల చిచ్చు పెట్టడానికి వైసీపీ పెద్దలు ఆడుతున్న నాటకంలో జూపూడి ప్రభాకర్ ఓ భాగం అయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. మొన్న తిట్టి.. ఇవాళ సారీ చెప్పి.. కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యతిరేక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు ఇలా వ్యూహాలు పాటిస్తారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జైల్లో కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నారు…ఈడీ కొత్త ఆరోపణ

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవల్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది ఈడీ. వైద్య పరమైన సాకులతో బెయిల్ పొందేందుకుగాను కేజ్రీవాల్ మామిడిపండ్లు, స్వీట్లు ఉద్దేశ్యపూర్వకంగా...

తొలి రోజు నామినేషన్లకు ఆసక్తి చూపని వైసీపీ నేతలు

ఏపీలో నామినేషన్ల సందడి తొలి రోజు అంతా పసుపు హడావుడి కనిపించింది. కూటమిలోని పలువురు కీలక నేతలు తొలి రోజు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు...

తలసాని డుమ్మా – బాపు కేసీఆర్‌కు షాక్ ఇవ్వడమే తరువాయి !

బాపు కేసీఆర్ కు.. గట్టి షాక్ ఇచ్చేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ రెడీ అయినట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వ్యూహం ఖరారు కోసం నిర్వహించిన సమావేశానికి తలసాని శ్రీనివాస్...

జగన్‌కు శత్రువుల్ని పెంచడంలో సాక్షి నెంబర్ వన్ !

ఎన్నికల సమయంలో జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడేవారి సంఖ్యను పెంచడంలో సాక్షి పత్రిక తనదైన కీలక భూమిక పోషిస్తుంది. ఎవరైనా తమను విమర్శిస్తున్నారో.. లేకపోతే టీడీపీకి మద్దతుదారుడని అనిపిస్తే చాలు వాళ్లపై పడిపోయి.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close