ఇక ఏపీలో ” పాల్ రావాలి – పాలన మారాలి” !

తెలంగాణలో రాజకీయానికి కేఏ పాల్ విరామం ప్రకటించినట్లుగా ఉన్నారు. అమెరికా నుంచి రావడంతోనే హైదరాబాద్‌లో పెద్ద ఆఫీస్ ప్రారంభించి యాత్రలతో హడావుడి చేసిన ఆయన ఇప్పుడు హఠాత్తుగా ఏపీపై దృష్టి పెట్టారు. అమరవీరుల కుటుంబాలను పార్టీలో చేర్చుకుని రాజకీయం చేయడంతో ఆయనకు కొంత ప్రతిఘటన తెలంగాణలో ఎదురయింది. కొన్ని కేసులు నమోదయ్యాయి. తెలంగాణ ప్రభుత్వంపై సీబీఐ చీఫ్‌కు కూడా ఫిర్యాదు చేసి కలకలం రేపారు. బీజేపీ మద్దతుతోనే టీఆర్ఎస్‌కు ఆయన చికాకులు తెప్పిస్తున్నారన్న విశ్లేషణలు జరిగాయి.

అయితే హఠాత్తుగా పాల్ తెలంగాణ నుంచి ఏపీకి రాజకీయ క్షేత్రం మార్చినట్లుగా కనిపిస్తోంది. ఏపీలో ఆయన కారు యాత్ర చేపట్టారు. పాల్ రావాలి – పాలన మారాలి అంటూ కొత్త నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఏపీ వ్యాప్తంగా ఆయన పర్యటనకు రెడీ అయ్యారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆగబోనని సవాల్ చేస్తున్నారు. హఠాత్తుగా ఆయన ఏపీకి ఎందుకు మారారు.. ఏపీలో పాల్ రావాలి అనే నినాదం ఎందుకు తీసుకున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఆయనను బయట ట్రోల్ చేస్తున్నా.. ఎంతో కొంత ప్రభావితం చేస్తారన్న ఉద్దేశంతో కొంత మంది దాడికి కూడా వెనుకాడటం లేదు. సిరిసిల్లలో ఆయనపై టీఆర్ఎస్ నేత ఒకరు దాడి చేశారు. ఏపీలో అయితే ఇంకా పరిస్థితులు దారుణంగా ఉంటాయి. అచ్చం గా వైసీపీ రంగులను పోలి ఉండేలా ఆయన పార్టీ కూడా జనంలోకి వెళ్తే తమకు ఇబ్బందేనని అనుకుంటే ప్రతిబంధకాలు ఎదురవ్వొచ్చు. అయితే అలా చేయడం వల్ల పాల్‌కే ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మహానాడు : టీడీపీ 6 హామీలతో భవిష్యత్‌కు గ్యారంటీ !

మహానాడులో తెలుగుదేశం పార్టీ ప్రజలకు సంక్షే్మ రంగంలో ఆరు హామీలు ప్రకటించింది. భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో మినీ మేనిఫెస్టోని చంద్రబాబు ప్రకటించారు. నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు టీడీపీ...

ఎన్టీఆర్‌ను వైసీపీ స్మరించుకుంది.. చంద్రబాబును తిట్టడానికైనా సరే!

ఎన్టీఆర్ అందరి మనిషి. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సహజంగానేకొంత మందికి దూరంఅవుతారు. అలా దూరమైన వారు కూడా ప్రత్యేక సందర్భాల్లో దగ్గర చేసుకోక తప్పదు. ఎన్టీఆర్‌ను అలా దగ్గర చేసుకోవాల్సిన ప...

బాలయ్య కోసం కొత్త ప్ర‌పంచం సృష్టిస్తాడ‌ట‌

అ, క‌ల్కి, జాంబిరెడ్డి చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఇప్పుడు హను-మాన్ రూపొందిస్తున్నాడు. తేజా స‌జ్జా క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది. ఈలోగా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేసే...

అందరికీ బెంచ్ మార్క్ బిల్డింగ్‌లు – ఏపీ జనానికి మాత్రం బటన్లు !

తెలంగాణ ప్రభుత్వం ఓ పెద్ద సెక్రటేరియట్ కట్టుకుంది. కథలు కథలుగా చెప్పుకున్నారు. ఇప్పుడు కేంద్రం పార్లమెంట్ నిర్మించింది.. అంత కంటే ఎక్కువ కథలు చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ రెండు నిర్మాణాలూ అవసరం లేదని..దుబారా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close