చివరికి “పాల్ కామెడీ”నీ నమ్ముకుంటున్న వైసీపీ !

కేఏ పాల్ వైసీపీకి దగ్గరయ్యారు. ఇటీవలి కాలంలో ఏమయిందో కానీ ఆయన వైసీపీ ప్రసంగీకుడిగా మారిపోయారు. గతంలో అయితే తనకు ఏది నచ్చితే అది చెప్పేవారు. కానీ ఇప్పుడు వైసీపీకి నచ్చేది చెబుతున్నారు. అవినాష్ రెడ్డికి మత్తుగా మాట్లాడుతున్నారు. ఆయన బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు దగ్గరకు కూడా వెళ్లి హడావుడి చేశారు. కర్నూలు ఆస్పత్రిలో అవినాష్ రెడ్డి తల్లి చికిత్స పొందుతున్నప్పుడు కూడా ఆయన వెళ్లి పరామర్శించారు. అవినాష్ రెడ్డి చాలా మంచి వాడని కితాబిచ్చారు.

కేఏ పాల్ మాటల్ని చూసి.. పాపం వైసీపీ అనుకునేవారు ఎక్కువైపోయారు. వైసీపీ కోసం మాట్లాడేది పోసాని, అలీ, కేఏ పాల్ లాంటి మేధావులా.. వారితో ఇష్టారీతిన మాట్లాడించి ప్రజలకు ఏదో సందేశం ఇప్పించుకోవాలనుకుంటున్నారా అని.. ఆశ్చర్యపోతున్నారు. వీరిని ఎంగేజ్ చేసుకోవాలన్న సలహా ఎవరిదో కానీ వారికో దండం అని.. వైసీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. కేఏ పాల్ మాట్లాడే మాటల్ని వినే ఎవరూ సీరియస్ గా తీసుకోరు. అలాంటి వ్యక్తితో సీరియస్ టాపిక్ మాట్లాడించి..అవినాష్ రెడ్డి మంచోడని చెప్పించడానికి తాపత్రయపడటం అంటే.. దిగజారిపోయిన భావదారిద్య్రానికి నిదర్శనమన్న వాదన వినిపిస్తోంది.

వైసీపీ తరపున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మంది మేధావులు మాట్లాడారు. కానీ ఇప్పుడు వారిలో చాలా మంది సైలెంట్ అయ్యారు. పదవులు పొందిన వారు కూడా ఎందుకో సైలెంట్ అయ్యారు. కల్లాం అజేయరెడ్డిలాంటి వాళ్లు జగన్ ను నేరుగా ఇరికించేశారు. దీంతో ఇప్పుడు కేఏ పాల్, పోసాని, అలీ లాంటి వాళ్లను హైలెట్ చేసుకుంటున్నా వైసీపీ నేతలు. మా పార్టీ రేంజ్ కు వాళ్లే ఎక్కువ.. కింది స్థాయి నేతలు… విరక్తి చెందేలా వారు మాట్లాడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైతన్య : నిజమే మాస్టారూ – వై ఏపీ నీడ్స్ బటన్ రెడ్డి ?

వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని జగన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఆంధ్రాకు ఆయన అవసరం ఏంటి అనే చర్చ ప్రజల్లో పెట్టబోతున్నారు. ఇది నెగెటివ్ టోన్ లో ఉంది. అయినా...

ఈ సారి కూడా మోదీకి కేసీఆర్ స్వాగతం చెప్పలేరు !

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స అందిస్తున్నట్లుగా మంత్రి కేటీఆర్ తెలిపారు. వారం రోజులుగా జ్వరం, దగ్గుతో కేసీఆర్ బాధపడుతున్నారు. ఒకటి, రెండు రోజులకు తగ్గిపోయే...

టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అని మర్చిపోతున్న కేటీఆర్ !

కేటీఆర్ ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఉన్నారు. భారత రాష్ట్ర సమితి వరకూ వెళ్లలేదు. అందరితో పాటు తాను కూడా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ... అలా అనుకోవడం లేదు....

ఉద్యోగులందర్నీ సాగనంపుతున్న బైజూస్

ఆన్ లైన్ విద్యను వ్యాపారంగా చేసుకుని లక్షల కోట్లకు పడగలెత్తే ప్రయత్నంలో జారి కిందపడిన బైజూస్ .. లేవడానికి చేస్తున్న ప్రయత్నాలు దివాలా దిశగా సాగుతున్నాయి. ఇటీవలే సీఈవో గుడ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close