‘కన్నప్ప’ విషయంలో ఏదో మ్యాజిక్ జరుగుతోంది. స్టార్లంతా ఈ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించడానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ప్రభాస్, అక్షయ్ కుమార్, శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ వీళ్లంతా కీలక పాత్రల్లో నటించడానికి ఓకే చెప్పేశారు. ఇప్పుడు కాజల్ కూడా ఈ లిస్టులో చేరిపోయింది. అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పార్వతిగా కాజల్ కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. మంగళవారం అక్షయ్ కుమార్ సెట్లో అడుగుపెట్టారు. త్వరలోనే కాజల్ ఎంట్రీ కూడా జరగబోతోంది.
పార్వతిగా చాలామంది పేర్లు పరిశీలనకు వచ్చాయి. నయనతారని అనుకొన్నారు. అనుష్క ప్రస్తావన వచ్చింది. చివరికి కాజల్ గా ఓకే చేసినట్టు సమాచారం. అనుష్క, నయన కూడా ఈ ప్రాజెక్టులో ఉంటారా, లేదంటే వారి స్థానంలోనే కాజల్ వచ్చిందా? అనే వివరాలు తెలియాల్సివుంది. ప్రభాస్ ఈ చిత్రంలో నందీశ్వరుడిగా కనిపించబోతున్నాడు. త్వరలోనే ప్రభాస్ కూడా సెట్లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి.