కాళేశ్వరం సబ్ కాంట్రాక్టర్లు ఫిరాయింపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలా..?

కొండపోచమ్మ సాగర్ కాలువకు పడిన గండిని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాజకీయంగా ఉపయోగపడుతోంది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు అతి సమీపంలో ఉండే వెంకటాపూర్ గ్రామాన్ని ఆ నీరు ముంచెత్తింది. అయితే.. సమస్య అది కాదు.. ఇప్పుడు … కాంగ్రెస్ రాజకీయం మొత్తం.. ఆ కాలువను నిర్మించిన కాంట్రాక్టర్ చుట్టూనే తిరుగుతోంది. అందులోని విషయాలన్నీ బయటకు తీస్తే.. పార్టీ ఫిరాయింపుల కోణం కూడా బయటకు వస్తోంది. దీంతో.. కాంగ్రెస్ నేతలకు కొత్త ఉత్సాహం పుట్టుకు వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ టెండర్ ..మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి దక్కింది. కానీ ఆ కంపెనీ చాలా పనులను.. సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చింది.

ఇలా కొండ పోచమ్మ సాగర్ పనులను..కూడా.. వేరే కంపెనీకి ఇచ్చింది. ఆ కంపెనీ నాసిరకం పనులు చేయడంతో ప్రారంభించిన ఒకటి, రెండు రోజుల్లోనే గండి పడింది. ఇప్పుడు ఆ సబ్ కాంట్రాక్టర్ ఎవరనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వెలికి తీసింది. తీరా చూస్తే.. ఆయన ఫిరాయించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అనే విషయం బయటపడింది. దీంతో కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇలా కాంట్రాక్టులు ఆశ చూపి.. పార్టీలో చేర్చుకున్నారని.. వారు నాసికరం పనులు చేసి.. ప్రజా ధనం కొల్లగొట్టారని ఆరోపిస్తున్నారు. ఇది పెద్ద స్కాం అని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలు.. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు.

గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో మెజార్టీ టీఆర్ఎస్ లో చేరిపోయారు. వారిలో సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్లకి పదవులు.. ఇతరులకు కాంట్రాక్టులు.. వచ్చాయని చెబుతున్నారు. ఇప్పుడు ఎవరెవరికి ఎలాంటి లబ్ది కలిగిందో.. బయటకు తీసి ప్రజల ముందు పెట్టాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారు. ప్రజాధనం దోచి.. ఫిరాయింపులకు ఉపయోగించారనే విషయాన్ని హైలట్ చేయాలనే నిర్ణయించుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కేకే , కడియం..!!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా కేసీఆర్ సన్నిహిత నేతలు కూడా హస్తం గూటికి చేరేందుకు...

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close