అమరావతికి ఎయిర్‌పోర్టు ఉందా..? రైల్వే స్టేషన్ ఉందా..?

అమరావతి పోరాటం విషయంలో ప్రభుత్వం ఎదురుదాడి చేయడానికి విచత్రమైన కారణాలను ఎదుర్కొంటోంది. ఉద్యమం ప్రారంభమై 200 రోజులు అయిన సందర్భంగా పెద్ద ఎత్తున దేశ, విదేశాల నుంచి రైతులకు సంఘిభావం తెలియచేశారు. ఈ సందర్భంగా.. వైసీపీ మంత్రులు.. కొన్ని భిన్న వాదనలతో తెరపైకి తెచ్చారు. మంత్రి కన్నబాబు.. అదేదో ఇరవై తొమ్మిది గ్రామాల సమస్య అన్నట్లుగా నిన్న వాదించారు. ఆదివారం మంత్రి అవంతి శ్రీనివాస్ మరింత భిన్నమైన ఎదురుదాడి చేశారు. అమరావతి అభివృద్ధి చేయాలంటే 30 ఏళ్లు పడుతుందని .. అమరావతి బస్టాండ్ ఉందా..రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్‌పోర్టు ఉందా? అని ప్రశ్నించారు.

రాజధానికి రైతులకు దేశ విదేశాల నుంచి వచ్చిన మద్దతు అంతా.. చంద్రబాబు జూమ్ రాజకీయాలతో ఆర్గనైజ్ చేశారని విమర్శించారు. అమరావతి కావాలో విశాఖ కావాలో దమ్ముంటే.. నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. విశాఖ నుంచి కూడా అమరావతికి పెద్ద ఎత్తువ మద్దతు లభించింది. టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. సబ్బం హరి కూడా.. అమరావతి రైతులకు మద్దతుగా ప్రసంగించారు. దీంతో.. ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్న సవాల్‌తో అవంతి తెరపైకి వచ్చారు.

రాజధని మార్చాలనుకుంటోంది కాబట్టి… ఆ ప్రజాభిప్రాయం ఏదో.. కనుక్కోవాల్సింది వైసీపీనే. కానీ.. అవంతి శ్రీనివాస్ మాత్రం.. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయం వైసీపీ చేస్తోందని విమర్శలు వస్తున్నా.. మంత్రులు.. ఎవరికి వారు ఎక్కడి పాట అక్కడ పాడుతున్నారు.ఈ విషయంలో మంత్రి అవంతి శ్రీనివాస్ ముందున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close