ధర్డ్ ఫ్రంట్ పెట్టేసుకుని సీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్న కమల్..!

తమిళనాడు ఎన్నికల్లో తనను ఎవరూ పట్టించుకపోయినా కమల్ హాసన్ మాత్రం తన పని తాను చేసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తన బలం తేలిపోవడంతో ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన పార్టీలు కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఆయన విడిగా పోటీ చేయడమే మంచిదని అటు అన్నాడీఎంకే కూటమి.. ఇటు డీఎంకే కూటమి కూడా భావించాయి. అందుకే ఆయనతో ఎలాంటి చర్చలు జరపలేదు. ఎవరూ ఏ కూటమిలోనూ చేర్చుకోకపోతే ఏమయిందనుకున్నారేమో కానీ.. తానే ఓ కూటమిని పెట్టేశారు కమల్ హాసన్. ధర్డ్ ఫ్రంట్ పెట్టేశానని.. వచ్చేవారు వచ్చి తనతో చేతులు కలపవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చారు.

శరత్ కుమార్ .. కమల్ హాసన్‌తో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారు. ఆయనకు కూడా ఉనికిలో లేని ఓ పార్టీ ఉంది. కమల్ హాసన్.. రజనీకాంత్ తో పోటీగా ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ.. మాస్ ఇమేజ్ లేదు. దాంతో ఆయన పార్టీ పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేదు. మక్కల్ నీది మయ్యం పేరుతో ఆయన పెట్టిన పార్టీలో కొంత మంది నేతలు ఇతర పార్టీల్లో చేరిపోయారు. రజనీకాంత్‌ పార్టీ పెడితే పొత్తు పెట్టుకుందామనుకున్నారు. కానీ రెడీ అని చెప్పిన తర్వాత రజనీకాంత్ మిడిల్ డ్రాప్ అయ్యారు. దాంతో కమల్ హాసన్ కు ఇక ఒంటరి పోరు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒంటరిగా పోటీచేస్తే తాను అయినా గెలుస్తాడో లేదో నన్న టెన్షన్ ఉంది.

అయినప్పటికీ.. కమల్ ఏ మాత్రం నిరాశ చెందడం లేదు. మూడో కూటమి తరపున తానే ముఖ్యమంత్రి అభ్యర్థినని ప్రకటించేసుకుని రంగంలోకి దిగుతున్నారు. ప్రస్తుతం తమిళనాడులో అన్నాడీఎంకే కూటమి వర్సెస్ డీఎంకే కూటమి హోరాహోరీగా సాగుతోంది. శశికళ జైలు నుంచి విడుదలైనా… ప్రస్తుత ఎన్నికల్లో జోక్యం చేసుకునే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close