వరదల సమయంలో జగన్ అమెరికా పర్యటన పై విమర్శలు

రాష్ట్రంలో వరదలు ఉన్న సమయం లో ప్రజల బాగోగులు, భద్రత గాలికొదిలేసి జగన్ అమెరికా పర్యటన చేస్తున్నాడంటూ కొందరు నేతలు విమర్శలు గుప్పించారు. విజయవాడలో వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికార పార్టీ నాయకులు మాత్రం చంద్రబాబు ఇంటికి వరద రాజకీయాలు చేస్తున్నారని మరి కొందరు నేతలు విమర్శలు గుప్పించారు. వివరాల్లోకి వెళితే..

బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ చేస్తూ, “రాష్ట్రంలో వరదల సమయంలో ప్రజల బాగోగులు అక్కరలేని సీఎం అమెరికా వెళ్లారు. 5 ఏళ్ళు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినాయన ‘కొంప మునిగి’ హైదరాబాద్ జారుకున్నాడు..వారిద్దరి ‘తోక నేతలు’ చేస్తున్న చర్చ “ఇల్లు మునిగిందా,లేదా”? ఇల్లు సంగతి వదిలేయండి మీ రెండు పార్టీల వలన రాష్ట్రం నిండా మునుగుతోంది ” అని రాసుకొచ్చారు. అలాగే మరొక నేత తులసి రెడ్డి కూడా జగన్ పై విమర్శలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్‌ రాష్ట్రాన్ని వదిలి అమెరికా వెళ్లడం బాధాకరమని పేర్కొన్న తులసి రెడ్డి, వరద ముంపు ప్రాంతాలను పట్టించుకోకుండా చంద్రబాబు ఇల్లు మునిగిందా? లేదా? అంటూ వైఎస్ఆర్ సీపీ, టిడిపి పార్టీలు రొచ్చు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ఇదిలా ఉంటే వైఎస్ఆర్ సీపీ నేత అంబటి రాంబాబు మాత్రం గత ఐదేళ్లు రాష్ట్రంలో కరువు కాటకాలు ఉన్నాయని, జగన్ అధికారం చేపట్టడం వల్ల రాష్ట్రం లో జలకళ వచ్చిందని వ్యాఖ్యలు చేశారు. వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వ్యాఖ్యలు అంతగా ఆనందాన్ని కలిగించలేదు.

ఏది ఏమైనా వరదల కారణంగా, వరదల సమయంలో జగన్ ప్రజలను సందర్శించకుండా అమెరికా పర్యటన చేయడం కారణంగా ప్రస్తుతానికి రాజకీయ విమర్శలు రాష్ట్రంలో బలంగా వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close