ఫ‌లితాలు రాగానే క‌ర్ణాట‌క‌లో క‌మ‌లం ఆప‌రేష‌న్ షురూ..!

అధికారం ద‌క్కించుకోవ‌డం కోసం భాజ‌పా ఏ స్థాయి రాజ‌కీయాలు చేస్తుందో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ మొద‌లుకొని చాలా రాష్ట్రాల్లో చూశాం. క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత కూడా దాదాపు అలాంటి ఎత్తుగ‌డతో అధికారం చేప‌ట్టాల‌ని ప్ర‌య‌త్నించారు. కానీ, భాజ‌పా వ్యూహం బ‌య‌ట‌కి పొక్కేయ‌డంతో… ప‌రువు పోతుంద‌నీ, త్వ‌ర‌లో లోక్ స‌భ ఎన్నిక‌లున్నాయ‌న్న‌ ఉద్దేశంతో ఆ ద‌శ‌లో వెన‌క్కి త‌గ్గార‌న్నది వాస్త‌వం! అయితే, ఇప్పుడు లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన వెంట‌నే క‌ర్ణాట‌క‌లో మ‌రోసారి క్యాంపు రాజ‌కీయాలు షురూ అయ్యే అవ‌కాశం క‌నిసిస్తోంది. దానికి కార‌ణం ఆ రాష్ట్ర భాజ‌పా నేత ఎడ్యూర‌ప్ప చేసిన వ్యాఖ్య‌లే..!

ఈనెల 23న ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌స్తాయి కాబ‌ట్టి, భాజ‌పా నాయ‌కు‌లంద‌రూ బెంగ‌ళూరులోనే ఉండాలంటూ ఎడ్యూర‌ప్ప‌ ఆదేశించారు. లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు భాజ‌పాకి అనుకూలంగా ఉండ‌బోతున్నాయ‌నీ, 280 ఎంపీ స్థానాలు ద‌క్కించుకుని మ‌రోసారి మోడీ ప్ర‌ధాని కావ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్, జేడీఎస్ ల మ‌ధ్య స‌రైన అవ‌గాహ‌న కుద‌ర‌క‌పోవ‌డంతో భాజ‌పాకి క‌లిసి వ‌చ్చింద‌నీ, ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త చాలా ఉంద‌నీ, రాష్ట్రంలో దాదాపు 22 ఎంపీ సీట్ల‌లో గెల‌వ‌బోతున్నామ‌న్నారు. అంతేకాదు, ఇప్ప‌టికే త‌మ‌తో దాదాపు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ట‌చ్ లో ఉన్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించ‌డం ఇప్పుడు చ‌ర్చనీయం అవుతోంది. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత రాష్ట్రంలో ప్ర‌భుత్వం కూలిపోతుంద‌నీ, దానిలో త‌మ ప్ర‌మేయం కూడా ఏమీ ఉండ‌ద‌నీ, అప్ప‌టి ప‌రిస్థితులు అలా మారతాయంటూ ఎడ్యూర‌ప్ప అభిప్రాయ‌ప‌డ్డారు!

దీంతో కాంగ్రెస్ పార్టీ అప్ర‌మ‌త్తం అవుతున్న‌ట్టు స‌మాచారం. ఎన్నిక‌ల ఫ‌లితాల రోజున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంద‌రినీ ఎక్క‌డికైనా త‌ర‌లిస్తే బాగుంటుంద‌నే అభిప్రాయంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ వ్యాఖ్య‌ల‌పై ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి కూడా కొంత ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ని స‌మాచారం. అంతేకాదు, సొంత ప్ర‌భుత్వంలోని కొంత‌మంది ఎమ్మెల్యేల‌పై ఆయ‌న ఓ క‌న్నేసి ఉంచార‌నీ, ఎన్నిక‌ల ఫ‌లితాల వెల్ల‌డికి ముందుకు రోజున ఏదో ఒక ప్రాంతానికి వారిని త‌ర‌లించే అవ‌కాశం ఉంద‌ని క‌న్న‌డ‌నాట వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు ట‌చ్ లో ఉన్నారంటూ మ‌రోసారి ఎడ్యూర‌ప్ప మైండ్ గేమ్ ప్రారంభించార‌ని అనుకోవ‌చ్చు. ఏదేమైనా, 23 త‌రువాత క‌ర్ణాట‌క‌లో ఏదో జ‌రుగుతుంద‌నే చ‌ర్చ మ‌ళ్లీ తెర‌మీదికి వ‌చ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close