గెలిచినా బీజేపీది ఓటమే..! పతనానికి నాందే..!!

ఒక వైపు డబ్బు, మరో వైపు అధికారం .. ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి ఈ రెండు చాలు. ఈ రెండింటిని సమర్థంగా వాడుకునే మేనేజర్లు బీజేపీలో ఉన్నంత కాలం .. ఆ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచిందన్న లెక్క ఉండదు. ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూనే ఉంటుంది. అయితే గోవా, మణిపూర్ రాష్ట్రాల లెక్క వేరు. కర్ణాటక లెక్క వేరు. ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుటుందని అందరూ నమ్ముతున్నారు. నిజంగా నిలబెట్టుకుంటే.. బీజేపీ శ్రేణులు కాసేపు హడావుడి చేయవచ్చు కానీ.. ఇది కచ్చితంగా ఆ పార్టీ పతనానికి నాందే.

బీజేపీ బలపరీక్షలో నెగ్గితే.. అధికార దుర్వినియోగం చేశారన్న ముద్ర బలంగా పడుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పొందడంలోనే.. కుట్ర చేశారని ప్రజలు నమ్ముతున్నారు. ఇపుడు విశ్వాస పరీక్షలో బలం లేకున్నా గెలిస్తే సానుకూల భావన ఎలా వస్తుంది. దేశంలోని వ్యవస్థలన్నింటినీ బీజేపీ భ్రష్టు పట్టించారన్న ఆగ్రహం ప్రజల్లో పెరిగిపోతుంది. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించి గెలిచారన్న అభిప్రాయం ఏర్పడుతుంది. యడ్యూరప్ప నెగ్గిన వెంటనే… బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలున్న చోట అలజడి పెరుగుతుంది. మా సంగతేంటని మిగతా రాష్ట్రాల్లోని పార్టీలు గవర్నర్‌ వద్దకు క్యూ కడతాయి. రేపు కొత్తగా ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు జరిగితే..అతి పెద్ద పార్టీకే అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుంది.

బీజేపీ, మోదీ విధానాలపై విపక్ష నేతలు భగ్గుమంటున్నారు. బీజేపీపై పోరాటం విపక్ష పార్టీలు అన్ని ఒక్కటవుతాయి. 2019 ఎన్నికల్లో ఈ పరిణామాలు మోదీకి వ్యతిరేకభావన పెరిగిపోతుంది. దాన్ని ఆపడానికి ఏం చేసినా ప్రయజనం ఉండదు. ఇప్పటికే.. యూపీలో ఎస్పీ, బీఎస్పీ కలవడం ఏర్పడిన … నష్టాన్ని పూడ్చుకోవడానికి బీజేపీ తంటాలు పడుతుంది.ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కలిస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గడ్డు పరిస్థితే. అందుకే కర్ణాటకలో బీజేపీ గెలిస్తే.. పీఠం అందుతుందేమో కానీ.. భవిష్యత్ లో ఢిల్లీ పీఠం కదిలిపోయే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close