ఈడీ నోటీసులు – లైట్ తీసుకున్న కవిత !

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణ తీరు కామెడీ అవుతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినా కురదరు రానని చెప్పేశారు. దాంతో ఆయనను అరెస్టు చేయాలా వద్దా అన్న దానిపై ఈడీ ఊగసలాడుతోంది. ఆయన సీఎం హోదాలో ఉన్నారు. ఆయనకు కొన్ని రాజ్యాంగ పరమైన రక్షణలు ఉంటాయి. అందుకే తటపటాయిస్తున్నారు. లేకపోతే సిసోడియా దగ్గరకే పంపించి ఉండేవారు. ఇప్పుడు కవిత కూడా ఈడీని అలాగే లైట్ తీసుకుంటున్నారు.

తనను విచారణ చేయవద్దని సుప్రీంకోర్టు నుంచి తనకు రక్షణ ఉందని అందుకే తనను పిలువవొద్దని.. తాను రానని నోటీసులకు సమాధానం ఇచ్చారు. తనను ఇంటి వద్దే విచారించాలని కవిత గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. నేరాల్లో విచారణల విషయంలో మహిళలకు చాలా వెసులుబాట్లు ఉండాలని ఆమె తరపు లాయర్లు సుప్రీంకోర్టులో వాదించారు. ఆ కేసులో విచారణకు పిలవకుండా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి నవంబర్‌కు వాయిదా వేసింది. కానీ మళ్లీ ఆ పిటిషన్ విచారణకు రాలేదు. దీంతో ఇప్పుడు మళ్లీ కవితను విచారణకు రావాలని ఈడీ పిలిచింది.

తనకు సుప్రీంకోర్టు ఉత్తర్వుల రక్షణ ఉన్నందున తాను రానని కవిత చెబుతున్నారు. కేజ్రీవాల్‌కు సీఎం ప దవి రక్షణగా ఉన్నట్లే కవితకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు రక్షణగా ఉన్నాయి. ఈ విషయంలో ఈడీ ఎలాంటి దూకుడు చూపిస్తుందో తెలియాల్సి ఉంది. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో దర్యాప్తు సంస్థలు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మిక్కీలో ఇంత మాస్ ఉందా ?

మిక్కీ జే మేయర్ అంటే మెలోడీనే గుర్తుకువస్తుంది. హ్యాపీ డేస్, కొత్తబంగారులోకం, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్.. ఇలా బిగినింగ్ డేస్ లో చేసిన సినిమాలు ఆయనకి మెలోడీని ముద్రని తెచ్చిపెట్టాయి. మిక్కీ...

ఆ రెండు స్కాములపైనా విచారణ.. హింట్ ఇచ్చిన రేవంత్

బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్స్ లో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు చేసిన కాంగ్రెస్..వీటిపై త్వరలోనే విచారణకు ఆదేశించనుందా..? అంటే జరుగుతోన్న పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణ...

టైమ్స్ జాబితాలో హైద‌ర‌బాదీ మ‌నం చాక్లెట్స్

బెస్ట్ చాక్లెట్స్ ఏవీ అన‌గానే స్విస్ చాక్లెట్స్ అంటారు. లేదా బెల్జియ‌మ్ చాక్లెట్స్ గుర్తుకొస్తాయి. కానీ ప్ర‌పంచంలో ది బెస్ట్ చాక్లెట్స్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప‌శ్చిమ గోదావ‌రి రైతులు పండించిన కోకోతో...

ఊరించి.. ఊరించి.. ఉసూరుమనిపించిన కేసీఆర్ !

ఇక నుంచి నా ఉగ్రరూపం చూస్తారు.. చీల్చిచెండాడుతానని అసెంబ్లీ వద్ద భీకర ప్రకటనలు చేశారు..ఈ ఒక్క డైలాగ్ ద్వారా ఇక కేసీఆర్ అసెంబ్లీకి హాజరు అవుతారని..రేవంత్ సర్కార్ కు చుక్కలు చూపిస్తానని సంకేతాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close