ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల – అసలు ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ !

షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం ఖాయమయింది. ఆందు కోసం ఆ పదవి ని ముందుగానే ప్రస్తుత చీఫ్ గిడుగు రుద్రరాజు రాజీనామా సమర్పించారు. అధికారిక నియామకం కోసం షర్మిల ఎదురు చూస్తున్నారు. షర్మిల కుమారుడి నిశ్చితార్థం ముగిసిన వెంటనే ఆమె బాధ్యతలు తీసుకుంటారు. అయితే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం షర్మిల కడప లోక్ సభ నుంచి లేదా పులివెందుల అసెంబ్లీ నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ ఆమె ఓడిపోతే కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపి పదవి ఇస్తారు. ఈ మేరకు చర్చలు జరిగాయని చెబుతున్నారు.

షర్మిల కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. ఈ కొద్ది రోజుల్లో ఆమె మార్చేదేమీ ఉండకపోవచ్చు కానీ రాజకీయంగా ఓ సంచలనం మాత్రం నమోదవుతుంది. జగన్ రెడ్డి తన కుటుంబాన్ని పూర్తిగా మోసం చేశారని అందుకే విడిపోయరన్న భావన ప్రజల్లోకి వెళ్లిపోతుంది. ఇప్పటికే ఆయన వ్యవహారశైలిపై ఎంతో మంది అసంతృప్తిగా ఉన్నారు. వారంతా టీడీపీలోకి వెళ్లలేరు. కానీ షర్మిల వైపు వెళ్లవచ్చు. అక్కడ గెలుస్తారా లేదా అన్న సంగతి పక్కన పెడితే.. రాజకీయంగా ఉనికి కాపాడుకునే అవకాశం ఉంటుంది. అదే జగన్ రెడ్డి వైపు ఉంటే… చాన్స్ ఉండదు.

మరో వైపు ఇప్పుడు విజయమ్మ ఏం చేస్తారన్నది కూడా వైసీపీలో చర్చ జరుగుతోంది. ఆమె కూతురికే మద్దతు పలికే జగన్ రెడ్డి నైతికంగా మరింత పతనమవుతారు. నేరుగా కాకపోయినా కొడుకు,కూతురులలో కూతురుతోనే రెండు, మూడు సార్లు బయట కనిపిస్ే అదే సందేశం వెళ్తుంది. జగన్ రెడ్డి మీ బిడ్డ.. బీ బిడ్డ అనే వేసే కేకల్లో కామెడీ బయటకు వస్తుంది. వైఎస్ కుటుంబ కథా చిత్రమ్ ఏపీ రాజకీయాల్లో రోడ్డున పడటానికి ఎన్నో రోజులు ఉండవని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎర్రబెల్లి సైలెన్స్ ఎందుకబ్బా..!!

బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కు అత్యంత సన్నితుడిగా పేరొందిన ఎర్రబెల్లి దయాకర్ ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆ మధ్య ఆయన కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా...

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close