నామా కేంద్ర మంత్రి – కాంగ్రెస్ కూటమి సర్కార్‌లోనా ?

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎవరితో ఉంటారో ఇంకా ప్రకటించలేదు ..కానీ ఆయన మాత్రం ఓ ప్లాన్ తో ఉన్నారు. నామా నాగేశ్వరరరావును కేంద్ర మంత్రిని చేయాలనుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీకి రెండు వందల సీట్లు దాటవు. అదే సమయంలో నాన్ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. అందులో నామా కేంద్ర మంత్రిగా ఉంటారని ప్రకటించారు. నాన్ బీజేపీ అంటే .. కాంగ్రెస్ కూటమి అనుకోవాలి. కేసీఆర్ కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు మానసికంగా సిద్ధమవుతున్నారా అనే డౌట్ ఈ కారణంగానే వస్తుంది.

రెండు కూటముల్లో లేని ప్రాంతీయ పార్టీలకు కనీసం పది సీట్లు వస్తాయని కూడా ఏ సర్వే చెప్పడం లేదు. రెండు కూటముల మధ్యే పోరు ఉంటోంది. పదేళ్ల పాటు అధికారంలో బీజేపీపై వ్యతిరేకత ఉందన్న భావనలో చాలా మంది ఉన్నారు. గత ఎన్నికల సమయంలోనూ అలాగే ఉన్నారు. కేసీఆర్ కూడా అదే అనుకున్నారు. అందుకే తనకు ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేలా పూర్తిగా సహకరించిన బీజేపీని పార్లమెంట్ ఎన్నికల నాటికి డంప్ చేసేశారు. అవసరం అయితే.. కాంగ్రెస్ తో కలుస్తానని కూడా స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇది బీజేపీ అగ్రనేతలకు అప్పట్లో ఆగ్రహం తెప్పించిందని చెబుతారు.

ఇప్పుడు కేసీఆర్ కు.. తాను బీజేపీకి సపోర్టు చేయను అని ధైర్యంగా చెప్పే పరిస్థితి లేదు. బీజేపీసీట్లు రావని.. నాన్ బీజేపీ కూటమి ఏర్పడుతుందని మాత్రం ఆశలతో ఉన్నారు. నిజానికి అలాంటి పరిస్థితి ఉందో లేదో కానీ.. తనకు వచ్చే సీట్లు ఏమైనా ఉంటే అవే క్రియాశీలకం అయినా సరే ఆయన ఖచ్చితంగా బీజేపీ వైపు మొగ్గుతారు కానీ.. కాంగ్రెస్ కూటమి జోలికి వెళ్లరన్న అభిప్రాయం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close