కొన్ని చోట్లే గాజు గ్లాస్ – గూడుపుఠాణి క్లియర్ !

జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను ఆ పార్టీ పోటీ చేయని చోట ఇతరులకు కేటాయించకూడదు. ఒక వేళ అది ఫ్రీ సింబల్ అయితే.. జనసేన పార్టీ పోటీ చేయని అన్ని స్థానాల్లోనూ ఇండిపెండెంట్లకు గుర్తులు అందుబాటులో ఉంచాలి. కానీ ఏపీలో ఏం జరిగిందో ఎవరికీ తెలియడం లేదు. పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ అందుబాటులో ఉంచారు. టీడీపీ, జనసేన రెబల్స్ కు కేటాయించారు. మిగిలిన చోట్ల మాత్రం గాజు గ్లాస్ ఎవరికీ ఇవ్వలేదు.. మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ గాజు గ్లాస్ కేటాయించారు.

ఇలా ఎందుకు జరిగింది ?. జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేశారు. ఢిల్లీ వెళ్లి ఎన్డీఏ కూటమి నేతలు ప్రత్యేకంగా ఈసీని విజ్ఞానప పత్రం ఇచ్చారు. ఇండిపెండెంట్లకు ఇవ్వకుండా ఉత్తర్వులు వచ్చాయన్న ప్రచారం జరిగింది. కానీ కొన్ని చోట్ల రిటర్నింగ్ అధికారులు తమకేమీ ఉత్తర్వులు రాలేదని చెప్పి కేటాయించేశారు. ఇంత గందరగోళం మధ్య జరుగుతున్న ఎన్నికలకు ఎవరు బాధ్యత వహిస్తారు ?. ఖచ్చితంగా ఎన్నికల నిర్వహణ నిజాయితీ ఉందని ఎవరూ చెప్పలేని పరిస్థితి. సామాన్య జనానికి డౌట్లు వచ్చే ఎన్నో అంశాలు బహిరంగంగా జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవస్థలు వ్యవహరిస్తున్నాయి.

టీడీపీ, జనసేన కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న సమయంలో బీజేపీ వచ్చి కూటమితో కలిసింది. బీజేపీ నుంచి కొంత సహకారాన్ని ఆ రెండు పార్టీలు ఖచ్చితంగా కోరుకుంటాయి. కానీ అలాంటి సహకారం ఇప్పటి వరకూ అందలేదని స్పష్టంగా చెప్పవచ్చు. సహకారం అంటే.. నిబంధనలకు అనుగుణంగా పని చేసేలా అధికార యంత్రాంగాన్ని అందుపులో ఉండేలా కట్టడి చేయడమే. కానీ అది కూడా జరగడం లేదని జరుగుతున్న పరిణామాలతో అంచనా వేయవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close