జగన్ ఎప్పుడో చేశారు.. కేసీఆర్ ఇప్పుడు చేయాలనుకుంటున్నారు !

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొన్ని పనులను తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు అమలు చేయాలనుకుంటున్నారు. అందలో మొదటిది ప్రైవేటు స్కూల్ ఫీజులను నియంత్రించడం.. రెండోది ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడం.. మూడోది ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేయడం. ఈ మూడింటి విషయంలో కేసీఆర్ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజులను నియంత్రించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. అలాగే వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనకై.. కొత్త చట్టాన్ని తీసుకురావాలని కూడా నిర్ణయించారు.

ఈ రెండు అంశాల పై పూర్తి అధ్యయనం చేసి సంబంధిత విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకొస్తారు. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7289 కోట్ల తో …” మన ఊరు – మన బడి” ప్రణాళిక కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే సీఎం జగన్ అక్కడ స్కూళ్ల నియంత్రణ పేరుతో.. మరీ దారుణంగా రూ. పదివేలకు అటూఇటుగా ఫీజు నిర్ణయించడంతో కక్ష సాధింపు కోసమే ఈ చట్టం తీసుకొచ్చారన్న ఆరోపణలు వచ్చాయి.

అంత తక్కువ మొత్తంతో సౌకర్యాలు కల్పించి చదువు చెప్పడం కష్టమని.. కోర్టుకెక్కారు. ఇప్పుడు ఈ పంచాయతీ కోర్టులో ఉంది. తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు కోసం కాకుండా.. రీజనబుల్‌గా ఆలోచిస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. ఇక నాడు-నేడు పేరుతో ఏపీలో వేల కోట్లు ఖర్చు పెట్టారు. కానీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలంటే.. క్వాలిటీ టీచర్స్ ఉండాలి. చాలా స్కూళ్లలో ఖాళీగా టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ లోపాలపై కేసీఆర్ దృష్టి పెడితే ఏపీ కన్నా పక్కాగా విద్యా వ్యవస్థను సంస్కరించగలుగుతారన్న అభిప్రాయం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close