ఒక్క బటన్ నొక్కండి – మహారాష్ట్ర ప్రజలకు కేసీఆర్ పిలుపు !

భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన తర్వాత తొలి సారిగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో బహిరంగసభ ఏర్పాటు చేసిన కేసీఆర్.. ఒక్క బటన్ నొక్కితే దేశమంతా మారిపోతుందని ప్రజలకు పిలుపునిచ్చారు. యుద్ధం చేయమని.. . తల్వార్లు తిప్పమని చెప్పడం లేదని ఒక్క బటన్ నొక్కండి చాలని కేసీఆర్ కోరారు. మహారాష్ట్రలో జరగనున్న జిల్లాల పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వచ్చే జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపాలని రైతులకు పిలుపునిచ్చారు.

మహారాష్ట్రతో తెలంగాణది రోటీ – భేటీ బంధమన్నారు. పది రోజుల్లో శివాజీ సొంత గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీ యాత్ర ప్రారంభమవుతుందన్నారు. రైతులంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని.. వాటిని ఆపాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు ఎందుకీ దుస్థితి అని ప్రశ్నించారు కేంద్రంలో పార్టీలు మారాయి.. ప్రధానులు మారారని, అయినా ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదన్నారు. మన దేశంలో 16 కోట్ల మంది రైతులు ఉన్నారని.. దేశ జనాభాలో రైతులు, వ్యవసాయ కూలీలు 50 శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు.రైతులు కేవలం నాగలి దున్నేవాళ్లే కాదు.. చట్టాలు చేసేవాళ్లుగా కూడా ఎదగాలన్నారు.

దేశంలో చైనా బజార్లు పోయి.. భారత్ బజార్లు రావాలన్నారు. మేకిన్ ఇండియా కాస్తా జోకిన్ ఇండియా అయిందన్నారు. జీవనదులు ఉన్న మహారాష్ట్రకు కరవెందుకు వచ్చిందని కేసీఆర్ ప్రశ్నించారు. మన కిసాన్‌ సర్కార్‌ వస్తే ప్రతి ఎకరాకు సాగునీరు , తాగు నీరు అందుతుందని చెప్పారు. బీడ్‌, లాథూర్‌, పర్బనీ వంటి ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని కేసీఆర్‌ అన్నారు. రైతులకు ఎంతో చేయాల్సి ఉందన్నారు. దళితులకు రైతు బంధు దేశవ్యాప్తంగా అమలుచేయాల్సి ఉందన్నారు. ఢిల్లీలో మహారాష్ట్ర సర్కారు రాగానే… తెలంంగాణలో ఉన్న అన్ని పథకాలను మహారాష్ట్రలో అమలు చేస్తామన్నారు.

నాందెడ్‌ ఆదిలాబాద్ శివారులో ఉండటంతో ఆ జిల్లాల నుంచే అత్యధికంగా జన సమీకరమ చేశారు. మరో వైపు పలువురు పార్టీ నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే వీరిలో గుర్తింపు ఉన్న నేతలు తక్కువ. ఇప్పటి వరకూ ఇతర రాష్ట్రాల్లో పోటీ గురించి ప్రకటన చేయని కేసీఆర్.. జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడంతో బీఆర్ఎస్ తెలంగాణ బయట మహారాష్ట్రలోనే తొలి ఎన్నికల సమయంలో పాల్గొనబోతున్నట్లుగా స్పష్టమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“ఆహా” ఆదాయం కన్నా నష్టాలే ఎక్కువ !

ప్రముక ఓవర్ ది టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా మంచి పనితీరు కనబరుస్తున్నప్పటికీ నష్టాలు మాత్రం ఆదాయం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. భారత కార్పొరేట్ వ్యవహారాల శాఖకు సమర్పించిన...

ఇప్పుడు “మంత్రుల టిక్కెట్లు” చింపే ధైర్యం ఉందా !?

ముగ్గురు, నలుగురు టిక్కెట్లు చినిగిపోతాయని సీఎం జగన్ కేబినెట్ సమావేశంలోనే మంత్రుల్ని హెచ్చరించారు. ఆ తర్వాతి రోజే ఎవరెవర్ని తీసేస్తారు.. ఎవరెవర్ని తీసుకుంటారు అనే లీకులు కూడా సజ్జల క్యాంప్ నుంచి...

ప్రభం”జనం”లా మారుతున్న లోకేష్ పాదయాత్ర !

లోకేష్ పాదయాత్రకు వస్తున్న జనం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏ రోజుకారోజూ అంచనాలకు అంతనంత మంది పాదయాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా గోరంట్లలో లోకేష్ పాదయాత్రలో...

ఏపీ పేరును ” వైఎస్ఆర్‌ ఏపీ ” అని మార్చేశారా !?

ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్. ఏపీ ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ విధానం అమలు చేయాలంటే... ఏపీ అని ప్రారంభిస్తుంది. అంటే ఏపీ భవన నిర్మాణ విధానం, ఏపీ పారిశ్రామిక విధానం,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close