చిరంజీవిని ఫోన్‌లో పరామర్శించిన కేసీఆర్ !

కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ సీఎం కేసీఆర్ పరామర్శించారు. అందరూ ట్వీట్ల ద్వారా కోలుకోవాలని పలకరిస్తే కేసీఆర్ మాత్రం అలాంటి వాటికి భిన్నంగా నేరుగా ఫోన్ చేశారు. ఫోన్ చేసి క్షేమ సమాచారాలు తెలుసుకుని జాగ్రత్తలు చెప్పారు. రెండు రోజుల కిందటే చిరంజీవికి కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో టెస్టు చేయించుకోవడంతో పాజిటివ్ వచ్చింది.

దీన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన చిరంజీవి తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చిరంజీవికి కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు, లోకేష్ సహా పలువు ట్విట్టర్‌లో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. గతంలో చంద్రబాబు,లోకేష్ కరోనా బారిన పడినప్పుడు చిరంజీవి కూడా ట్వీట్ చేశారు. జగన్ కూడా వారికి ట్వీట్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఎలాంటి ట్వీట్ చిరంజీవి కోలుకోవాలని రాలేదు.

అయితే సీఎం కేసీఆర్ మాత్రం నేరుగా ఫోన్ చేసి క్షేమసమాచారాలు తెలుసుకున్నారు. రాజకీయాలతో సంబంధం లేకపోయినా ఇండస్ట్రీ కోసం.. రెండు, మూడు సార్లు కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో చిరంజీవి ఇతర టాలీవుడ్ ప్రముఖులతో సమావేశం అయ్యారు. వారి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close