దుబ్బాకలో కేసీఆర్ ప్రచారం ..!?

దుబ్బాక ఉపఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రచారానికి సిద్ధమవుతున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. లక్ష మెజార్టీని లక్ష్యంగా పెట్టుకున్నానని హరీష్ రావు చెబుతున్నారు. ఆ దిశగా ఆయన తనదైన శైలిలో వ్యూహం రచిస్తున్నారు. అయితే.. గత ఆరేళ్ల పాలనా కాలంలో వ్యతిరేకత టీఆర్ఎస్ వర్గాలను ఇబ్బంది పెడుతోంది. డబుల్ బెడ్ రూం సహా అనేక హామీ ఇంకా.., హామీల్లానే ఉండిపోయాయని.. ప్రజల్లో చర్చ జరుగుతోంది. విపక్షాలు దాన్నే ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో..టీఆర్ఎస్ ఒకింత ఒత్తిడి ఎదుర్కొంటోంది. అందుకే.. ఫైనల్ టచ్.. కేసీఆర్‌తో ఇప్పిస్తే.. ప్రచారం గొప్పఫినిషింగ్‌కు వచ్చినట్లవుతుందని అంచనా వేస్తున్నారు.

దుబ్బాక ఉపఎన్నికలు అత్యంత కీలకమైనవిగా మారడంతో.. కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గతంలో మూడు అసెంబ్లీ ఉపఎన్నికలు జరిగాయి. కానీ ఒక్క నారాయణఖేడ్‌లో కేసీఆర్‌ ప్రచారం చేశారు. పాలేరు, హుజూరాబాద్‌ ప్రచారంలో పాల్గొనలేదు. కానీ భారీ మెజార్టీలతో గెలిచారు. లక్ష మెజార్టీని సాధించాలంటే.. సీఎం వచ్చి.. మాట్లాడితే బాగుంటుందనేది పార్టీలో కొందరి అభిప్రాయం. కేసీఆర్ అడుగు పెట్టకపోతే.. ఓ వేళ భారీ మెజార్టీ వస్తే.. క్రెడిట్ మొత్తం.. హరీష్ రావుకు పోయే ప్రమాదం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు.

గతంలో కేసీఆర్‌ సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ నియోజకవర్గంలోని 11 గ్రామాలు ఇప్పుడు దుబ్బాకలో ఉన్నాయి. ఇప్పుడు సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ సైతం దుబ్బాక పక్కనే ఉంటుంది. గడువు ముగిసే చివరి రోజుల్లో కేసీఆర్‌తో బహిరంగసభ పెట్టించాలనే ఆలోచన చేస్తున్నారు. కేసీఆర్‌ కూడా ుప్రచారం చివరికి వచ్చేటప్పుడు నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close