కేసీఆర్ ఇప్పుడే.. 25 జిల్లాలని జగన్ ఎప్పటి నుంచో చెబుతున్నారుగా..!?

ఏపీలో ఇరవై ఐదు జిల్లాలు రావొచ్చని.. తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించారు. తనతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాన్ని బట్టి ఇలా చెబుతున్నానని చెప్పుకొచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… తెలంగాణకు 33 జిల్లాలు అవసరం లేదని 20 ఉంటే చాలని చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఇలా..ఏపీ ప్రస్తావన తీసుకు వచ్చారు. అంతే.. ఏపీకి సీఎం జగన్మోహన్ రెడ్డినా.. కేసీఆరా అంటూ.. కొంత మంది సోషల్ మీడియాలో విమర్శలు ప్రారంభించారు. ఏపీలో ఇరవై ఐదు జిల్లాలు వస్తాయని.. ప్రత్యేకంగా అసెంబ్లీలో కేసీఆర్ చెప్పడం కాదు.. ఎన్నికల ముందు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు.

పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లా చేస్తానని ప్రకటించడమే కాదు… ఆయా జిల్లాలకు తగ్గట్లుగా పార్టీ అధ్యక్షుల్ని కూడా నియమించారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జిల్లాల ఏర్పాటులో పెద్దగా ముందడుగు పడలేదు. రాజధాని మార్పు… స్థానిక ఎన్నికలు..జనగణన ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడుతున్నాయి. దాంతో.. ఈ ఏడాది కాదు.. వచ్చే ఏడాదిలోనే జిల్లాల విభజన చేయాలనుకుంటున్నారు. తెలంగాణ సీఎం కొత్తగా చెప్పడం కాదు కానీ.. ఏపీలో ఇరవై ఐదు జిల్లాలపై మాత్రం అందరికీ క్లారిటీ ఉంది. కానీ కేసీఆర్ చెప్పడం.. జగన్ తప్పన్నట్లుగా.. కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించడం ప్రారంభించారు.

జగన్మోహన్ రెడ్డి అన్నీ కేసీఆర్ అనుమతితోనే చేస్తున్నారని.. మూడు రాజధానులు కూడా ఆయన ఆలోచనేనని టీడీపీ వర్గాలు ఆరోపిస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో.. కేసీఆర్.. ఆంధ్రా గురించి అసెంబ్లీలో మాట్లాడకపోతే బాగుండునని.. వైసీపీ నేతలు కూడా అనుకుంటున్నారు. కానీ ఆ మాట టీఆర్ఎస్ అధినేత వరకూ తీసుకెళ్లే పరిస్థితి లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

ప్రశాంత్ కిషోర్‌పై జగన్ తరహాలోనే దీదీ ఆక్రోశం !

టీడీపీ, బీజేపీలను గెలిపించేందుకే ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించినట్లుగా ఓ వీడియోను వైసీపీ హైలెట్ చేస్తోంది. కానీ ఆయన క్షేత్ర స్థాయిలో వర్క్ చేయడం లేదని.. కేవలం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close