లాక్‌డౌన్ కొనసాగించాలి : కేసీఆర్

తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగుతుందని.. ఫద్నాలుగో తేదీతో ముగుస్తుందనే ఆశలు పెట్టుకోవద్దని.. సీఎం కేసీఆర్ సంకేతాలు పంపారు. ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ ఎత్తివేస్తే ససమస్యలు వస్తాయని.. కొనసాగిచాలని ప్రధానమమంత్రి నరేంద్రమోడీకి కూడా సూచించానని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితులపై మీడియా సమావేశం నిర్వహించిన కేసీఆర్.. లాక్‌డౌన్‌ పొడిగిపుంపై ప్రజల్ని మానసికంగా సిద్ధం చేశారు. ప్రజలు తమకే వచ్చిన ఇబ్బందిగా భావించవద్దని ప్రపంచం మొత్తం లాక్ డౌన్ ఉందన్న విషయం గుర్తు చేశారు. ఇరవై రెండు దేశాలు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అయ్యాయని..మిగతా దేశాలు పాక్షిక లాక్ డౌన్ అయ్యాయన్నారు. కరోనా ప్రపంచానికి పట్టిన చీడగా అభివర్ణించారు.

అమెరికాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. మృతదేహాలను ట్రక్కుల్లో వేసుకెళ్తున్నారని.. అలాంటి పరిస్థితి భారత్‌లో వస్తే తట్టుకోలేమని.. కేసీఆర్ పేర్కొన్నారు. భారత్ లాంటి దేశాల్లో.. జూన్ వరకూ.. లాక్ డౌన్ అమలు చేయాల్సి ఉందని.. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక ఇచ్చిందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ వల్ల.. దేశం ఆర్థికంగా దెబ్బతింటోందని.. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తీవ్రమైన నష్టం వస్తోందన్నారు. అయినా.. ప్రస్తుతం కరోనాను ఎదుర్కోవడానికి లాక్ డౌన్ మినహా మరో మార్గం లేదని గుర్తు చేసారు. తెలంగాణలో కరోనా కేసులు పెరగడానికి నిజాముద్దీన్ ప్రార్థనలే కారణమన్నారు. తెలంగాణకు కూడా నిజాముద్దీన్ పీడ తగిలిందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 308 మంది కరోనా పాజిటివ్ రోగులు చికిత్స పొందుతున్నామని.. మరో వందకుపైగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

అత్యవసర సేవలు అందిస్తున్న వారికి ముఖ్యమంత్రి ఇన్సెంటివ్ ప్రకటించారు. వైద్యులు, వైద్య సిబ్బందికి జీతంలో పది శాతం సీఎం గిఫ్ట్ కింద ఇస్తామని తెలిపారు. మున్సిపాల్టీలు, పంచాయతీలు, జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందికి కూడా ప్రొత్సాహకాలు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లో మనో ధైర్యం పెంచాల్సి ఉందని.. కవులు, గాయకులు, బుద్ది జీవులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు. జాతి సమైక్యత కోసం..మోడీ పిలుపునిస్తున్న కార్యక్రమాలను విమర్శిస్తున్న వారు.. సమాజానికి అవసరం లేదని మండిపడ్డారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close