కేంద్రాన్ని కోర్టుకు లాగబోతున్న కేసీఆర్..!

తెలంగాణ సీఎం కేసీఆర్ పోరాటం ఎంచుకుంటే ఎవరూ ఆపలేరు. ఎదురుగా ఉన్నది కేంద్ర ప్రభుత్వం అయినా సరే ఆయన దూకుడుగానే వెళ్తారు. కేంద్రం జీఎస్టీ పరిహారం చెల్లింపు విషయంలో చట్టాన్ని ఉల్లంఘిస్తోందని నిర్ణయించుకున్న ఆయన.. న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. జీఎస్టీ చట్టం ప్రకారం.. ఆదాయం తగ్గిపోయినప్పుడు కేంద్రం రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లించాలి. కానీ ప్రస్తుతం ప్రభుత్వం.. “యాక్ట్ ఆఫ్ గాడ్” పేరుతో ఆ బాధ్యత నుంచి తప్పుకొంది. నిధులు కావాలంటే… ఆర్బీఐ వద్ద అప్పులు తీసుకోవాలని సూచించింది. దీనిపై కేసీఆర్ గుస్సా అవుతున్నారు. కేంద్రం చట్టాన్ని పాటించాల్సిందేనని.. రాష్ట్రాలకు సాయం చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఆయన మాటల్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు.

అప్పుల కోసం కేంద్రం షరతులకు లోబడే ప్రశ్నే లేదంటున్న కేసీఆర్.. న్యాయపరంగా నిధులను పొందేందుకు.. పోరాటం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే జీఎస్టీ చట్టం మెత్తాన్ని ఔపాసన పట్టి.. న్యాయనిపుణులతో సంప్రదింపులు కూడా జరిపారు. ఏ క్షణమైనా కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి రాజకీయ, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇతర రాష్ట్రాలు కొన్ని సైలెంటవుతున్నా…. కేంద్రం తీరుపై వాటికి కూడా అసంతృప్తి ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎలాగూ నోరెత్తలేవు. తాను న్యాయపోరాటం ప్రారంభిస్తే.. ఇతర రాష్ట్రాలు కూడా కలిసి వస్తాయని కేసీఆర్ అంచనా వేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులకు వెళ్లడం…అనూహ్యమే. అదీ కూడా కేంద్రం చట్ట ఉల్లంఘనకు పాల్పడిందని వెళ్లడం అసాధారణమే అవుతుంది. చట్టం ప్రకారం అయితే కేంద్రం.. రాష్ట్రాలకు నిధులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ కేంద్రం ఇవ్వడం లేదు. కేసీఆర్ న్యాయపోరాటం చేసి.. కేంద్రం తప్పనిసరిగా నిధులు ఇవ్వాల్సిందేనని తీర్పు వచ్చేలా చేయగలిగితే.. ఆయనకు జాతీయ స్థాయిలో పేరు వస్తుంది. కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్న జాతీయ రాజకీయానికి ప్లస్ అవుతుంది కూడా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎడిటర్స్ కామెంట్ : ట్యాపింగ్ – దొరికినవాడే దొంగ !

"టెక్నాలజీ మన జీవితాల్లోకి చొచ్చుకు వచ్చాక మన ప్రతి కదలికపై మరొకరు నిఘా పెట్టడానికి అవకాశం ఇచ్చినట్లే. తప్పించుకునే అవకాశం లేదు.." కాకపోతే ఈ అవకాశం అధికారం ఉన్న వారికే వస్తుంది....

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కేకే , కడియం..!!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా కేసీఆర్ సన్నిహిత నేతలు కూడా హస్తం గూటికి చేరేందుకు...

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close