గవర్నర్ తమిళిసై “చాన్సలర్” హోదా తీసేయనున్న సీఎం కేసీఆర్ !

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెలలో వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ సమావేశాల్లో యూనివర్శిటీలకు చాన్సలర్‌గా గవర్నర్‌ను తప్పించి ముఖ్యమంత్రిని నియమించే బిల్లును కూడా ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ సర్కార్‌ గవర్నర్ పై చాలా కాలంగా కారాలు మిరాయాలు నూరుతోంది. గవర్నర్ కూడా అంతే. బిల్లులు కూడా తన వద్దనే పెండింగ్ పెట్టుకుంటున్నారు కానీ ఆమోదించడం లేదు.. తిరస్కరించడం లేదు. అందులో యూనివర్శిటీల్లో నియామకాల బిల్లు కూడా ఉంది. విశ్వవిద్యాలయాల చాన్సలర్‌గా గవర్నర్ వ్యవహరిస్తున్నారు.

బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న బెంగాల్, కేరళల్లో గవర్నర్ల నుంచి చిక్కులు ఎక్కువగా ఉండటంతో ఆ రాష్ట్రాలు చాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. యూనివర్సిటీకి ఇప్పటి వరకు ఉన్న నియమ నిబంధనలను మారుస్తూ చట్టాలు చేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఇక నుంచి గవర్నర్ సారథ్యం అవసరం లేదని కేరళ, బెంగాల్ ప్రభుత్వాలు ప్రకటించాయి. నిజానికి గతంలోనే ఇలాంటి ప్రచారం జరిగింది. గత ఏడాది పది మంది ఉపకులపతులను ఎంపిక చేస్తూ తుది ఆమోదం కోసం గవర్నర్‌కు పంపగా తమిళిసై కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశారు. తర్వాత కేసీఆర్ జోక్యంతో అనుమతించారు. ఇప్పటికీ ములుగు ఉద్యానవన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రిని చాన్స్‌లర్‌గా నియమించే బిల్లును కూడా గవర్నర్‌ ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంది.

విశ్వవిద్యాలయాలు చేపట్టే అధ్యాపకుల నియామకాల్లో గవర్నర్‌ పాత్ర కీలకం. అక్కడా గవర్నర్ వైపు నుంచి చిక్కులు వచ్చే అవకాశం ఉంది. అందుకే వర్సిటీల చాన్సలర్‌ పదవి నుంచి గవర్నర్‌ను తప్పిస్తూ బిల్లును ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదం పొందినా, దానిపై సంతకం చేయాల్సింది గవర్నరే కావడం అసలు ట్విస్ట్. అయితే ఈ విషయంలో గవర్నర్‌కు ఉండే అధికారాలు పరిమితం. ఓ సారి తిరస్కరిస్తే.. మరోసారి బిల్లు ఆమోదించుకోవచ్చు. గవర్నర్ అంగీకరించకపోయినా చట్టం అయిపోతుంది. కానీ.. అటు ఆమోదించకుండా… ఇటు తిరస్కరించకుండా పెండింగ్‌లో ఉంచితేనే అసలు సమస్య. ఇప్పుడు తమిళిసై అదే చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close