హైదరాబాద్‌లో ప్రాంతీయ పార్టీల భారీ సదస్సు .. కేసీఆర్ ప్లాన్!

బీజేపీకి వ్యతిరేకంగా వివిధ ప్రాంతీయ పార్టీలు, భావసారూప్య పార్టీలతో మంతనాలు జరుపుతున్న కేసీఆర్‌.. జాతీయస్థాయిలో ప్రజాస్వామిక, లౌకిక శక్తుల ఐక్యత అవసరాన్ని నొక్కి చెప్పేందుకు హైదరాబాద్‌ వేదికగా సదస్సు నిర్వహించే ఆలోచన చేస్తున్నారు. దీనిని ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత నిర్వహించాలని భావిస్తున్నారు. ఎన్నికల్లో పార్టీల నేతలందరూ బిజీగా ఉంటారు. ఎన్నికలయిన తర్వాత అందరూ వచ్చే అవకాశం ఉంటుంది. మార్చిలో జరుగనున్న యాదాద్రి ఆలయ పునఃప్రారంభోత్సవానికి అన్ని ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వానించనున్నారు. ఆ సందర్భంగా సమావేశాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకపక్షాలను ఏకం చేసేందుకు ఆయా పార్టీలకు తమ సహాయ సహకారాలు అందించాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని సమాజ్ వాదీ పార్టీకి మద్దతిచ్చేఆలోచన చేస్తోంది. యూపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. సమాజ్ వాదీ పార్టీ గెలిచే అవకాశం ఉందని ఇటీవల ట్విట్టర్‌లో నిర్వహించిన ఆస్క్ కేటీఆర్‌లో మంత్రి సమాధానం ఇచ్చారు. సంప్రదింపుల తర్వాత అక్కడ వారికి మద్దతుగా ప్రచారం చేయడంపై స్పందిస్తామన్నారు. ఈ నెలాఖరులోగా సీఎం కేసీఆర్‌గానీ, టీఆర్‌ఎస్‌ ప్రతినిధి బృందం కానీ అఖిలేష్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది. సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమికి మద్దతుగా టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్‌ ఆ భేటీలో ఖరారు కానుంది.

యూపీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రచార బృందానికి మంత్రి కేటీఆర్‌ నేతృత్వం వహిస్తారని చెబుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ నిర్వహించే బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించే చాన్స్ ఉంది. యూపీలో పలు చోట్ల తెలుగువాళ్లకు గణనీయమైన సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ద్వారా బీజేపీకి వ్యతిరేకంగా తాము గట్టిగా నిలబడతామన్న సందేశాన్ని టీఆర్ఎస్ పంపాలనుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close