ఎన్నికల ఫలితాల కారణంగా కేసీఆర్‌లో “గుణాత్మక మార్పు”..!

పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు… టీఆర్ఎస్‌ అధినేతలో గుణాత్మక మార్పు తీసుకొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు బీజేపీ పునాదులు.. బలంగా పడ్డాయనే ఆందోళన.. మరో వైపు .. కాంగ్రెస్ పుంజుకుందనే… అంచనాలు కూడా… కేసీఆర్‌ను ఇబ్బంది పెడుతున్నాయి. ఓ వైపు జాతీయ రాజకీయాల కలలు నెరవేరకపోగా.. చాప కిందకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉండటంతో… వెంటనే.. దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు.

టీఆర్ఎస్‌లో ఇక గుణాత్మక మార్పులుండవ్..!

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు కోసం జాతీయ రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర పోషిస్తామన్న కేసిఆర్.. ఈ నినానాధంతోనే లోక్ సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవసరమైతే ఢిల్లీకి మారిపోతానని ప్రకటించారు. టిఆర్ఎస్ సహా ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడుతాయని భావించి.. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు కూడా చేశారు. ఆ సందర్భంలో కేంద్రంలో వచ్చేది హంగేనని కేసిఆర్ ఉప ప్రధాని అవుతారని టీఆర్ఎస్ నేతలు భావించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటిఆర్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడుతారన్న ప్రచారం ఫలితాలు వెళ్లడవ్వక ముందు వరకు సాగింది. కానీ ఇప్పుడు… పరిస్థితి మారిపోయింది.

బీజేపీ చాపకిందకు నీళ్లు తెస్తోందనే ఆందోళన..!

ఢిల్లీ సంగతి అటుంచితే.. ఇటు తెలంగాణ లో పోటీ చేసిన లోక్ సభసీట్ల ఫలితాలు టిఆర్ఎస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత ఎన్నికల్లో టిడిపి పొత్తుతో పోటీ చేసి కేవలం ఒకే ఒక్క సీటు బిజేపి దక్కించుకుంటే.. మొన్నటి ఎన్నికల్లో వందకు పైగా సీట్లల్లో డిపాజిట్ కూడా దక్కించుకోక చేతులెత్తేసిన కమలం పార్టీ ఎలా నాలుగు సీట్లు దక్కించుకుందని తలలు బద్దలు కొట్టుకుంటోంది. ఎన్నికల ఫలితాలపై కేసిఆర్ స్పందించేందుకు ఇష్టపడలేదు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నో మార్పులు జరుగుతాయని టిఆర్ఎస్ నేతలు భావించారు. మలి విడత మంత్రి వర్గ విస్తరణపై సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల పై ఆశలు పెట్టుకున్నారు. అయితే తాజా ఫలితాలు టిఆర్ఎస్ లో నిరాశను నింపాయి. ఎప్పుడు సందడిగా ఉండే తెలంగాణ భవన్ సైలెంట్ గా మారింది. కేసిఆర్ కుమార్తె సీటు కూడా కమలం పార్టీ సునామి లో కొట్టుకు పోవడాన్ని నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

మంత్రులకు ఊస్టింగ్ ఖాయమే..!

గ్రేటర్ హైదరాబాద్ పరధిలో, సిటిని ఆనుకుని ఉన్న సికింద్రాబాద్, మల్కాజిగిరి స్థానాల్లో ఒటమి చెందడంపై కేసిఆర్ స్థానిక నేతలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. చేవెళ్లలో అతి కష్టం మీద రంజిత్ రెడ్డి బయటపడ్డారు. జూలైలో జెడ్పీ, ఎంపీపీ ఛైర్మన్ ఎన్నికల తర్వాత మలి విడత మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. ఎంపీ సీట్లను గెలిపించడంలో విఫలమైన మంత్రులకు ఉద్వాసన తప్పదని చెబుతున్నారు. ఈ జాబితాలో ముందుగా తలసాని ఉన్నారు. ఆయన తన కొడుక్కి… పట్టుబట్టి టిక్కెట్ దక్కించుకున్నారు కానీ.. విజయం కోసం ప్రయత్నించలేదు. సనత్ నగర్‌లో… గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 70వేల ఓట్లు వస్తే.. లోక్‌సభ ఎన్నికల్లో 35వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇది కూడా కేసీఆర్ ఆగ్రహానికి కారణం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close